హైదరాబాద్: కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ కానిస్టేబుల్ పన్నెండేళ్ల బాలిక పై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధ్యత గల వృత్తిలో పోలీసు వృత్తిలో ఉండి.. వావి, వరస మరచి అత్యాచారం చేయడమే కాకుండా ఎవరికైనా చెబితే చంపేస్తానని బాధితురాలని బెదిరించాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు . సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ రాంగోపాల్పేట స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఉమేశ్… బోయిన్పల్లి సిఖ్విలేజ్లోని ఓ స్కూల్ సమీపంలో నివాసం ఉంటున్నాడు. కొద్దిరోజుల క్రితం భార్య డెలివరీ కావడంతో పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో … తన ఇంటి దగ్గరలోని వరుసకు మేనకోడలైన 12 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి ఉమేష్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు బాలల హక్కుల అతనిపై సంఘానికి ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.