కిడ్నాప్ కేసు విచారణలో పురోగతి సాధించాం

కిడ్నాప్ కేసు విచారణలో పురోగతి సాధించాం

బోయినపల్లి కిడ్నాప్ కేసులో ఇతర నిందితులను మరో రెండురోజుల్లో పట్టుకుంటామన్నారు హైదరాబాద్ సీపీ అంజన్ కుమార్. ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోందన్నారు. అఖిలప్రియను దర్యాప్తు అధికారులు ప్రశ్నిస్తున్నారని.. రేపటితో  కస్టడీ ముగుస్తుందన్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ ని ఇంటరగేషన్ లో వచ్చిన సమాచారాన్ని లింక్ చేసి ఈ కేసులో పురోగతిని సాధించామన్నారు. అఖిలప్రియ కస్టడి పూర్తయిన తరువాత రేపు చంచల్‌గూడ జైలుకు పంపిస్తామన్నారు. విచారణలో వచ్చిన వాస్తవాలతో పాటు టెక్నికల్ ఎవిడెన్స్ లను కోర్టు ముందు ఉంచుతామన్నారు.

ఆన్ లైన్ లో పాఠాలు‌ చెప్పడం ఓ చాలెంజ్