కరోనా ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ ప్రమాదకరం

కరోనా ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ ప్రమాదకరం

కరోనా ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ ప్రమాదకరమైందన్నారు హైదరాబాద్ సీపీ సజ్జనార్ . రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయని.. ప్రజలందరూ జాగ్రత్తగా  ఉండి మాస్క్ ధరించాలన్నారు. 
ఇక నుంచి పంక్షన్ లకు దూరంగా ఉండి..కోవిడ్ రూల్స్ ను పాటించాలన్నారు. ప్రజలు గుంపులు గుంపులుగా ఉండొద్దన్నారు. షాప్ యాజమాన్యాలు కూడా మాస్క్ ఉంటేనే లోపలికి అనుమతించాలన్నారు.  ప్రతి ఒకరు  సామాజిక దూరం పాటించాలన్నారు. 45 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరూ  కూడా కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు.