హైదరాబాద్: అక్రమంగా బంగారం తరలించేందుకు దొంగలు ఎన్ని ప్లాన్లు వేస్తారో అందరికీ తెలిసిందే. పలు రూపాల్లో స్మగ్లింగ్ చేసి ఇప్పటి వరకు చాలామంది అలా బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు. చాలామంది బంగారాన్ని బిస్కెట్ల రూపంలో లేదంటే షూలో, బ్యాగుల్లో, బట్టల్లో, అండర్వేర్లో దాచుకొని తీసుకెళ్తూ కూడా కస్టమ్స్ అధికారుల తనిఖీలలో పట్టుబడ్డారు. ఈ సారి పట్టుబ్డ దొంగను చూస్తే ఇలా కూడా స్మగ్లింగ్ చేస్తారా అని ఆశ్చర్యపోతారు. ఓ కిలాడీ లేడీ రూ. 18 లక్షల విలువైన బంగారు పూసలను బుర్కాకు ఉన్న డిజైన్లో పెట్టి కుట్టించుకుంది. స్మగ్లింగ్ చేయబోయి అడ్డంగా కస్టమ్స్ అధికారులకు దొరికిపోయింది. ఈ ఘటన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో చోటు చేసుకుంది. దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఓ విమానంలో ఓ మహిళ ఇలా బుర్కాలో బంగారాన్ని తరలించబోయింది. అనుమానం వచ్చిన అధికారులు తన బుర్కాను చెక్ చేయగా బుర్కాకు ఉన్న ఎంబ్రాయిడరీ డిజైన్కు పూసలను కుట్టినట్టు కనిపించాయి. దీంతో వాటిని డిజైన్ నుంచి వేరు చేసిన అధికారులు ఆ గోల్డ్ను లెక్కించగా.. అది 350 గ్రాములుగా ఉంది. దాని విలువ రూ.18.18 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఆ మహిళపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. బుర్కా నుంచి అధికారులు బంగారు పూసలను తీసి లెక్కించిన వీడియోను హైదరాబాద్ కస్టమ్స్ అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా అది వైరల్ అవుతుంది.
మరిన్ని వార్తల కోసం
సీపీ నోట టీఆర్ఎస్ స్క్రిప్ట్.. రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదు
కుట్ర వెనక ఉన్న అన్ని విషయాలను బయటపెడతాం
On 27.02.22,Hyderabad Customs booked a case of smuggling of gold valued Rs.18.18 lakh weighing 350.00 grams against a passenger who arrived from Dubai by Flight No.FZ-439. Pax concealed gold in beads form which were stitched to burqas.@cbic_india @cgstcushyd @PIBHyderabad pic.twitter.com/xlGSF2vUa4
— Hyderabad Customs (@hydcus) February 27, 2022