హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ ఏటీఎంలో దొంగనోట్లు... బ్యాంకు ఉద్యోగులకే షాక్..

హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ ఏటీఎంలో దొంగనోట్లు... బ్యాంకు ఉద్యోగులకే షాక్..

హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లోని ప్రముఖ బ్యాంకుకి చెందిన ఏటీఎంలో దొంగనోట్లు రావడం కలకలం రేపింది. ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేద్దామని వెళ్లిన ఇద్దరు బ్యాంకు ఉద్యోగులు ఏటీఎంలో దొంగనోట్లు రావడంతో షాక్ అయ్యారు. రూ. 5 వేలు డ్రా చేయగా.. మొత్తం నకిలీ రూ. 500 నోట్లు వచ్చినట్లు తెలిపారు బాధితులు. ఈ ఘటనపై బ్యాంకు మేనేజర్ కి ఫిర్యాదు చేశారు ఉద్యోగులు. ఏటీఎంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా.. గుర్తు తెలియని వ్యక్తి కస్టమర్ లా వచ్చి క్యాష్ డిపాజిట్ చేసి వెళ్లినట్లు గుర్తించారు బ్యాంకు సిబ్బంది.

ఈ ఘటనపై ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు సిబ్బంది. బ్యాంకు సిబ్బంది ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు పోలీసులు.

ఇప్పుడంటే యూపీఐ పేమెంట్స్ కి అలవాటు పడి చాలామంది క్యాష్ మెయింటైన్ చేయడం తక్కువయ్యింది కానీ.. నకిలీ నోట్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏకంగా ఏటీఎంలోనే నకిలీ నోట్లు డిపాజిట్ చేశారంటే.. దుండగులు ఏ రేంజ్ కి ఎదిగిపోయారో అర్థమవుతుంది. కాబట్టి.. ఇక మీదట ఏటీఎంలో క్యాష్ విత్ డ్రా చేసినా కూడా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం బెటర్.