పానీ మే హైదరాబాద్.. ఫామ్​హౌస్ మే కేసీఆర్

పానీ మే హైదరాబాద్.. ఫామ్​హౌస్ మే కేసీఆర్

బల్దియా కార్యాలయం ముందు కాంగ్రెస్ నేతల ఆందోళన

హైదరాబాద్, వెలుగు: ‘హైదరాబాద్ పానీమే.. కేసీఆర్ ఫామ్​హౌస్ మే’ అంటూ కాంగ్రెస్ నేతలు జీహెచ్​ఎంసీ ఆఫీసు ముందు శుక్రవారం ఆందోళనకు దిగారు. వరద నీటిలో ప్రజలు అల్లాడిపోతుంటే సీఎం కేసీఆర్ కోట దాటడంలేదంటూ మండిపడ్డారు. ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ మాట్లాడుతూ.. 1938లో మూసీ వరదలొస్తే నిజాం నవాబు ప్రజలను ఆదుకున్నాడని, నయా నవాబు కేసీఆర్ మాత్రం బయటకు కూడా రాలేదని విమర్శించారు. హైదరాబాద్​ను రూ. 64 వేల కోట్లతో అభివృద్ధి చేసినట్లు కేసీఆర్, కేటీఆర్ చెబుతున్నారని.. ఎక్కడ చేశారో చూపించాలని డిమాండ్​ చేశారు. సర్వే చేయకుండానే రూ. 5 కోట్ల నష్టం జరిగిందని కేసీఆర్, కేటీఆర్ చెప్పడమేంటని మండిపడ్డారు. వరదల్లో చిక్కుకున్న వారికి కనీసం అన్నం కూడా సర్కారు అందిచడం లేదని దుయ్యబట్టారు. తర్వాత కమిషనర్​కు మెమోరాండం అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు అంజన్ కుమార్, బండ చంద్రారెడ్డి, ఫెరోజ్ ఖాన్, అనిల్ కుమార్ యాదవ్​ తదితరులున్నారు.

వీ6 రిపోర్టర్​పై పోలీసుల జులుం

కాంగ్రెస్ నేతలు నిర్వహిస్తున్న ఆందోళనను కవర్​ చేసేందుకు వెళ్లిన వీ6 రిపోర్టర్​పై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. న్యూస్ కవర్ చేయకుండా నెట్టేశారు. పోలీసుల తీరుపై జర్నలిస్టులు మండిపడుతున్నారు.

For More News..

నాలాల దగ్గరున్నోళ్లు ఖాళీ చేస్తే డబుల్ ఇండ్లిస్తం

పెరిగిన భారతీయుల ఆయువు

నీట్‌లో తెలంగాణ బిడ్డకు థర్డ్ ర్యాంక్