1870లోనే హైదరాబాద్ పారిశ్రామికీకరణకు శ్రీకారం: మూడు దశల్లో గొప్పగొప్ప పరిశ్రమలు ఏర్పాటు

1870లోనే హైదరాబాద్ పారిశ్రామికీకరణకు శ్రీకారం: మూడు దశల్లో గొప్పగొప్ప పరిశ్రమలు ఏర్పాటు

Hyderabad Industrial Hub: బ్రిటిష్​ ఇండియాలో పారిశ్రామికీకరణ పూర్తిగా ప్రైవేట్​ఆధ్వర్యంలో జరిగింది. కానీ హైదరాబాద్​రాజ్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగింది. ఇందుకోసం 1929లో ప్రభుత్వం కోటి రూపాయల నిధిని ఏర్పాటు చేస్తూ పరిశ్రమల అభివృద్ధికి ఇండస్ట్రియల్​ట్రస్టు ఫండ్​(ఐటీఎఫ్​)ను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఈ నిధిని కోటి నుంచి రూ. 3 కోట్లకు పెంచారు. చిన్న పరిశ్రమలకు అప్పుగా ఇచ్చి వాటిని ప్రోత్సహించడంతో పాటు అక్కడ నుంచి వచ్చిన లాభాలను చిన్నతరహా పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి ఉపయోగించేవారు. అంతకుముందు 1917లో ఇండస్ట్రియల్​ లేబరేటరీ, 1918లో ప్రత్యేక కామర్స్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్​ను ఏర్పాటు చేశారు. 

హైదరాబాద్​ రాజ్యంలో పారిశ్రామిక అభివృద్ధి 3 దశల్లో జరిగింది. మొదటి దశ సాలార్​జంగ్​–1 ప్రధానిగా ఉన్న 1870లో మొదలై 1918 వరకు కొనసాగింది. రెండో దశ 1919లో మొదలై 1939లో అంటే రెండు ప్రపంచ యుద్ధాల మధ్యకాలం, మూడో దశ  రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం 1939 నుంచి 1948 వరకు కొనసాగింది. 

* సాలార్​జంగ్​–1 సంస్కరణల ఫలితంగా ఆధునిక రవాణా, సమాచార రంగాల్లో చేపట్టిన విప్లవాత్మక సంస్కరణల ద్వారా తెలంగాణ ప్రాంతంలో నూనె ఉత్పత్తులు, మరాఠ్వాడ ప్రాంతంలో పత్తి ఉత్పత్తులు స్టార్ట్ అయ్యాయి. 1899లో హైదరాబాద్​ గోదావరి వ్యాలి రైల్వేలైను మన్మాడ్​ను కలుపుతూ ఏర్పాటు చేయడం ఆ ప్రాంతాల్లో పత్తి, దానికి సంబంధించిన స్పిన్నింగ్​, జిన్నింగ్​ పరిశ్రమలను నెలకొల్పడానికి తోడ్పడింది. హైదరాబాద్​ దక్కన్​ స్పిన్నింగ్​, వీవింగ్​ మిల్స్​ లిమిటెడ్​ (1877), మహబూబ్​శాయి గుల్బర్గా మిల్స్​ (1884), ఔరంగాబాద్​ మిల్స్​ (1888) స్థాపించారు. డోర్నకల్​ జంక్షన్​ నుంచి సింగరేణి బొగ్గు గనులకు వేసిన రైలుమార్గం ద్వారా బొగ్గు రవాణా సులువైంది. 1901 వరకు అన్ని రకాల పరిశ్రమలు కలిపి 68 వరకు స్థాపించారు. 

* డీబీఆర్​ మిల్లు(1920): దివాన్​ బహదూర్​ రాంగోపాల్​ మిల్లు.. దీన్నే డీబీఆర్​ మిల్స్​ అంటారు. ఈ మిల్లును 1920, ఫిబ్రవరి 14న హైదరాబాద్​ లోయర్​ట్యాంక్​బండ్​లో స్థాపించారు. ఇది ప్రైవేట్ కంపెనీ.. బయట నుంచి తీసుకువచ్చిన ముడి సరుకులతో బట్టలు తయారు చేసే పరిశ్రమ.. ఇది ప్రస్తుతం మూతపడింది.

* నిజాం చక్కెర పరిశ్రమ(1937): నిజామాబాద్​ జిల్లాలోని బోధన్​ పట్టణంలో స్థాపించారు. 

* ఆల్విన్​ మెటల్​ వర్క్స్​: ఆల్విన్​ లిమిటెడ్​ను 1942, జనవరిలో ఆల్విన్​మెటల్​వర్క్స్​గా ఇండస్ట్రియల్​ ట్రస్ట్​ ఫండ్​, మెసర్స్​అల్లావుద్దీన్​ అనే కంపెనీ ఉమ్మడి వ్యవస్థతో స్థాపించారు. 

* ప్రాగా టూల్స్​: సికింద్రాబాద్​లోని కవాడిగూడలో యంత్రాల పనిముట్లు తయారు చేసే ఉద్దేశంతో ప్రాగా టూల్స్​ కార్పొరేషన్​ అనే పేరుతో 1943, మేలో స్థాపించారు. 1963లో ప్రాగా టూల్స్​ లిమిటెడ్​గా మారుస్తూ డిఫెన్స్​ మినిస్ట్రీకి అప్పగించారు. 

* సర్​సిల్క్​: సిరిపూర్​ కాగజ్​నగర్​ ప్రాంతంలో సిరిపూర్​ పేపర్​ మిల్లును ఏర్పాటు చేయడంతో దీన్ని సిరిపూర్​ పేపర్​ మిల్లు(ఎస్​పీఎం)గా పిలుస్తారు. ఈ పేపర్​ మిల్లు భారతదేశంలో స్థాపించిన మొదటి పరిశ్రమల్లో ఒకటి. 1942 నుంచి ఉత్పత్తి ప్రారంభమైంది. 

* వజీర్​ సుల్తాన్​ టుబాకో కంపెనీ: ఈ పరిశ్రమను 1916లో హైదరాబాద్​విటల్​వాడిలో వజీర్​ సుల్తాన్​ ప్రారంభించారు. ఈ పరిశ్రమను 1930లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య సలహా మేరకు ప్రస్తుతం ఉన్న వీఎస్​టీ అంటే ముషీరాబాద్​ – అజామాబాద్​కు మార్చారు. 

ALSO READ : జంతర్ మంతర్ దగ్గర పేలిన పెల్లెట్ గన్స్ అంటే ఏంటి..? ఇవి ఇంత డేంజరా..

* ఆజమ్​జాహిమిల్స్: ఇది బట్టలు ఉత్పత్తి చేసే పరిశ్రమ.. 1934లో వరంగల్​లో స్థాపించిన పరిశ్రమల్లో అతి ముఖ్యమైంది. 

* దక్కన్​ విమానయాన సంస్థ లిమిటెడ్​: ఇది హైదరాబాద్​ పట్టణంలో బేగంపేట దగ్గర నిజాం ప్రభుత్వం, టాటా ఎయిర్​ లైన్స్ కంపెనీ సంయుక్తంగా స్థాపించిన వాణిజ్య విమానయాన సంస్థ.. ఇది 3 విమానయాన సర్వీసులతో ప్రారంభమైంది. 1953లో ఇండియన్ ఎయిర్​ లైన్స్​లో విలీనమైంది. 

* సింగరేణి కాలరీస్​(1921): దీనిని ఖమ్మం జిల్లాలోని సింగరేణి అనే గ్రామం పేరుతో పిలుస్తున్నారు. ఇక్కడే మొదట బొగ్గు గనులు బయటపడ్డాయి. లండన్​కు చెందిన హైదరాబాద్​ దక్కన్​ మైనింగ్​ కంపెనీ సింగరేణి నుంచి బొగ్గు గనులు తవ్వడం ప్రారంభించింది. మొదట్లో దీనిపై పర్యవేక్షణాధికారమంతా ప్రభుత్వాధీనంలోనే ఉండేది. 1920 తర్వాత సింగరేణి కాలరీస్​ కంపెనీ అనే సంస్థ ప్రభుత్వ ఆర్థిక సాయంతో ముందుకువచ్చి పరిపాలనా బాధ్యతలు చేపట్టింది. 

* హైదరాబాద్​స్టేట్​ బ్యాంక్​: 1941లో మీర్​ ఉస్మాన్ అలీఖాన్ ప్రభుత్వ బ్యాంకును నెలకొల్పాడు. దీన్నే ఆ రోజుల్లో హైదరాబాద్​స్టేట్​ బ్యాంక్​ అనేవారు. ఆ తర్వాత స్టేట్​బ్యాంక్​ఆఫ్​హైదరాబాద్​గా మారింది.. ప్రస్తుతం ఈ బ్యాంకులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వీలినం చేశారు. 

* కార్ఖానా జిందా తిలిస్మాత్​: ఈ కంపెనీ ప్రజలు బాగా ఉపయోగించే జిందా తిలిస్మాత్​, ఫారూకి పళ్లపొడి, జిందా బామ్​ అనే వస్తువులను ఉత్పత్తి చేస్తుంది. ఈ పరిశ్రమను 1920లో హకీం మహ్మద్​ మొహినుద్దీన్​ ఫారూకి హైదరాబాద్​లో స్థాపించారు.