హైదరాబాద్లో దారుణం.. ఎంపీ టికెట్ ఆశిస్తు్న్నాడని బీజేపీ లీడర్ హత్య

హైదరాబాద్లో దారుణం.. ఎంపీ టికెట్ ఆశిస్తు్న్నాడని బీజేపీ లీడర్ హత్య

హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. యూసుఫ్ గూడలో నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన బీజేపీ నేత సింగోటం రామన్న హత్యకు గురయ్యాడు. రాత్రి 11 గంటల టైంలో 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్న హత్య చేసినట్టు స్థానికులు చెప్తున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించారు DCP కృష్ణ చైతన్య, జూబ్లీ హిల్స్ ఏసీపీ. పాత కక్షల కారణంగా హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. 

అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్ గా ఉన్నారు సింగోటం రామన్న. ఆటో డ్రైవర్ నుండి  చేపల ఎగుమతులు చేసే స్థాయికి ఎదిగారు రామన్న. కొంత కాలంగా సోషల్ సర్వీస్ చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు సింగోటం. పాలమూరు జిల్లా  కొల్లాపూర్ నియోజవర్గం సింగోటం ప్రాంతంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల టైంలో బీజేపీలో చేరారు రాములు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ జిల్లా నుండి బీజేపీ ఎంపీ  టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఈ హత్యకి పాత కక్షలు కారణమా.. లేక బీజేపీ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారని హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.