రీల్స్ పిచ్చితో 200 కి.మీ స్పీడ్తో కారు డ్రైవింగ్

రీల్స్ పిచ్చితో 200 కి.మీ స్పీడ్తో కారు డ్రైవింగ్
  • ఓఆర్ఆర్ రింగ్​రోడ్డుపై రాకెట్​వేగం అరెస్ట్ చేసిన నార్సింగి పోలీసులు

గండిపేట, వెలుగు: లైకులు, వ్యూస్ కోసం రోడ్లపై అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై గంటకు 200 కిలోమీటర్లకు పైగా వేగంతో కారు నడపడమే కాకుండా.. ఆ వీడియోను ఫోన్​లో తీసి ఇన్​స్టాగ్రామ్​లో అప్​లోడ్ చేసిన వ్యక్తిని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు.

మణికొండ అల్కాపూర్ టౌన్​షిప్​కు చెందిన కొత్తపల్లి యశ్వంత్ రెడ్డి (32) ప్రైవేట్ ఉద్యోగి. ఇటీవల తన వోక్స్​వ్యాగన్ కారు కండిషన్​ను టెస్ట్ చేయాలన్న ఆలోచనతో నార్సింగి టోల్ ప్లాజా నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ టోల్ ప్లాజా వైపు ఓఆర్‌ఆర్​పై ఇతర వాహనదారులకు ముప్పు వాటిల్లేలా ర్యాష్ డ్రైవింగ్ చేశాడు.  రాకెట్ వేగంతో ప్రమాదకర డ్రైవింగ్ వీడియోను ఇన్​స్టాగ్రామ్​లో అప్​లోడ్​చేయడంతో వైరల్​గా మారింది. పోలీసులు ఆదివారం  నిందితుడిని ఆదివారం అరెస్ట్ చేసి, కారును సీజ్ చేశారు.