
బషీర్బాగ్, వెలుగు: సైబర్ చీటర్లు ఓ వ్యక్తికి రివ్యూకు డబ్బులిస్తామని నమ్మించి రూ.14 లక్షలు కొట్టేశారు. హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి తెలిపిన ప్రకారం... నగరానికి చెందిన 43 ఏళ్ల వ్యక్తికి వాట్సాప్ లో అవంతి సిన్హా పేరుతో మెసేజ్ వచ్చింది. గూగుల్ ద్వారా రివ్యూలు ఇవ్వాలని.. ఒక్కో రివ్యూకు రూ.40 చెల్లిస్తామని స్కామర్లు చెప్పారు. టెలిగ్రామ్ లో వీఐపీ డైమండ్ డిజిటల్ అనే గ్రూప్ లో జాయిన్ చేశారు. కొన్ని మొదట కొన్ని రివ్యూస్ కు డబ్బులు ఇచ్చారు.
ఆ తరువాత ప్రీపెయిడ్ ఇన్వెస్ట్ టాస్క్ లు చేయాలని సూచించారు. బాధితుడు బై మోర్ పై క్లిక్ చేసి ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్చేశాడు. తరువాత అకౌంట్ ఫ్రీజ్ అయిందని, ట్యాక్స్ చెల్లించాలని పలుమార్లు బాధితుడి నుంచి డబ్బులు కట్టించారు. ఇలా మొత్తంగా రూ.14,08,964 బదిలీ చేశాక బాధితుడు మోసపోయినట్లు గ్రహించాడు.