హైదరాబాద్సిటీ/గండిపేట, వెలుగు: నగరంలోని బుల్కాపూర్ వద్ద సోమవారం తెల్లవారుజామున వాటర్ బోర్డుకు చెందిన భారీ పైప్లైన్ కుంగి ధ్వంసమైంది. సింగూరు నుంచి నీటిని సరఫరా చేసే 1200 ఎంఎం డయా మెయిన్ పైప్లైన్ ఉదయం 5 గంటలకు ఒక్కసారిగా లీక్ అవ్వడంతో రిపేర్ పనులు మొదలయ్యాయి.
ఈ పనులను వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి స్వయంగా తనిఖీ చేసి, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రిపేర్ల కారణంగా మణికొండ, నార్సింగి, షేక్పేట్, హకీంపేట్, టోలిచౌకీ, కాకతీయనగర్, మెహిదీపట్నం, ఆసిఫ్నగర్, కార్వాన్ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు ఆటంకం ఏర్పడింది.
