‘నృపతుంగ’ పూర్వ విద్యార్థుల సమ్మేళనం.. వివేక్ వెంకటస్వామికి సన్మానం

‘నృపతుంగ’  పూర్వ విద్యార్థుల సమ్మేళనం.. వివేక్ వెంకటస్వామికి సన్మానం

కాచిగూడలోని నృపతుంగ విద్యా సంస్థలో తాను ఇంటర్ చదువుకున్నానని.. ఈ కాలేజీతో తనకు ఎన్నో  జ్ఞాపకాలు ఉన్నాయని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. 1975లో ఈ కాలేజీలో ఇంటర్ చదువుకున్నానని చెప్పేందుకు గర్వంగా ఉందన్నారు. నృపతుంగ విద్యాసంస్థల పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో వివేక్ వెంకటస్వామి మాట్లాడారు.  ‘‘నృపతుంగలో చదువుకున్న వారు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఇక్కడి పూర్వ విద్యార్థుల్లో 30 మందికిపైగా డాక్టర్లు ఉన్నారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది’’ అని ఆయన చెప్పారు.  మరో పూర్వ విద్యార్థి జోషి మాట్లాడుతూ.. నృపతుంగ అలుమ్ని అసోసియేషన్ ను 2012 లో తిరుమల్ రావు అధ్యక్షుడిగా ఏర్పాటు చేశామని గుర్తు చేసుకున్నారు. అప్పటినుంచి ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని, విద్యార్థులకు చేయూత అందిస్తున్నామని తెలిపారు.  

ఈ కార్యక్రమం సందర్భంగా  బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి సహా పలువురు పూర్వ విద్యార్థులను  నృపతుంగ అలుమ్ని అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు. నృపతుంగ అలుమ్ని అసోసియేషన్  మొదటి అధ్యక్షుడు తిరుమల్ రావును వివేక్ వెంకటస్వామి సన్మానించారు.