
పద్మారావునగర్, వెలుగు: హైదరాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్కు 2024-25 లో చేపట్టిన వినూత్న కార్యక్రమాలకు గానూ పౌర- కేంద్రీకృత కార్యక్రమాల కేటగిరీలో అవార్డు లభించింది. 13వ పాస్ పోర్ట్ సేవా దివస్ సందర్భంగా సోమవారం ఢిల్లీలో విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరీటా చేతులమీదుగా ప్రాంతీయ పాస్ పోర్ట్ఆఫీసర్జొన్నలగడ్డ స్నేహజ ఈ అవార్డు అందుకున్నారు.
తెలంగాణ పోలీసులు పాస్ పోర్ట్లు వేగంగా ఇచ్చేందుకు కృషి చేస్తున్నారని మంత్రి అభినందించారు. పోలీస్విభాగానికి సంబంధించి ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ శివధర్ రెడ్డికి పురస్కారం అందించారు.