పాస్పోర్ట్ ఆఫీస్కు కేంద్ర పురస్కారం

పాస్పోర్ట్ ఆఫీస్కు కేంద్ర పురస్కారం

పద్మారావునగర్, వెలుగు: హైదరాబాద్ పాస్​పోర్ట్ ఆఫీస్​కు 2024-25 లో చేపట్టిన వినూత్న కార్యక్రమాలకు గానూ పౌర- కేంద్రీకృత కార్యక్రమాల కేటగిరీలో అవార్డు లభించింది. 13వ పాస్ పోర్ట్ సేవా దివస్ సందర్భంగా సోమవారం ఢిల్లీలో విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరీటా చేతులమీదుగా ప్రాంతీయ పాస్ పోర్ట్​ఆఫీసర్​జొన్నలగడ్డ స్నేహజ ఈ అవార్డు అందుకున్నారు.

 తెలంగాణ పోలీసులు పాస్ పోర్ట్​లు వేగంగా ఇచ్చేందుకు కృషి చేస్తున్నారని మంత్రి అభినందించారు. పోలీస్​విభాగానికి సంబంధించి ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ శివధర్ రెడ్డికి పురస్కారం అందించారు.