
- గోవా వెళ్లి ఎంజాయ్.. 18 మంది అరెస్ట్, మరో 10 మంది పరార్
- నిందితుల్లో ఓ కానిస్టేబుల్కూడా..
- రూ.43 లక్షలు,57 గ్రాముల గోల్డ్, 2 కార్లు,4 బైక్లు, 23 ఫోన్లు స్వాధీనం
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ కేసులో ట్విస్టులు చోటుచేసుకున్నాయి. వ్యాపారిని బెదిరించి నగదు దోచుకెళ్తున్న నిందితులను అడ్డుకున్న బైక్ఫైనాన్స్రికవరీ ఏజెంట్లు వారిని బెదిరించి, డబ్బు లాక్కొని గోవాకు పారిపోయారు. అక్కడ ఎంజాయ్చేసి, పోలీసులకు చిక్కారు. ఈ కేసు వివరాలను నార్త్జోన్డీసీపీ ఎస్.రష్మీ పెరుమాళ్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. 20 మందితో ఏర్పడిన ఓ ముఠా వారం రోజుల క్రితం తమ దగ్గర కిలో బంగారం ఉందని, బయట మార్కెట్ కన్నా 5 శాతం రేటు తక్కువని ఓ వ్యాపారిని నమ్మించారు.
ఆయన తన వద్ద ఉన్న రూ.43 లక్షలు చూపించడంతో తాము రాచకొండ ఎస్వోటీ పోలీసులమని చెప్పి, ఆ డబ్బులు తీసుకొని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు నిందితుల కోసం వెతకడం ప్రారంభించారు. అదేరోజు నిందితుల్లో ఇద్దరు రాంబాబు, రాధేశ్యామ్డబ్బులతో బైక్ పై వెళ్తుండగా దారిలో బైక్ ఫైనాన్స్రికవరీ ఏజెంట్లు 8 మంది వారిని అడ్డుకొని, తనిఖీ చేశారు. బ్యాగ్లో నగదును చూసి, బెదిరించి లాక్కొని గోవా పారిపోయారు. డబ్బులను పంచుకొని, ఎంజాయ్ చేశారు. ఈ కేసును చాలెంజ్గా తీసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించారు. మొదట దొంగతనం చేసిన ముఠా సభ్యులు ఇచ్చిన సమాచారంతో ఫైనాన్స్రికవరీ గ్యాంగ్ను రెండు రోజుల క్రితం అరెస్ట్చేశారు.
మొదటి ముఠాలో మీసాల కేశవులు అనే పోలీస్కానిస్టేబుల్ ఉండటం విశేషం. ఈ కేసులో మొత్తం 28 మంది నిందితులు కాగా, 18 మందిని అరెస్ట్ చేశామని డీసీపీ తెలిపారు. వారి వద్ద నుంచి రూ.43 లక్షలు, 59 గ్రాముల బంగారం, 2 కార్లు, 4 బైక్లు, 23 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మరో 10 మంది పరారీలో ఉన్నారన్నారు. కేసును ఛేదించిన మార్కెట్ పోలీస్స్టేషన్సీఐ రాంచందర్, డీఐ షాకీర్అలీ, ఎస్సైలు శివశంకర్, గిరిధర్, కె.మమత, లక్ష్మీనారాయణ, క్రైంటీంను అభినందించారు.