రామంతాపూర్‌‌‌‌లో ఐస్క్రీమ్ తయారీ యూనిట్పై.. ఎస్వోటీ పోలీసుల రైడ్

రామంతాపూర్‌‌‌‌లో ఐస్క్రీమ్ తయారీ యూనిట్పై.. ఎస్వోటీ పోలీసుల రైడ్

ఉప్పల్, వెలుగు: ఎక్స్​పైరీ మెటీరియల్​తో క్వాలిటీ లేని ఐస్​క్రీమ్స్​ తయారు చేస్తున్న రామంతాపూర్​లోని ఓ యూనిట్​పై ఎస్వోటీ పోలీసులు రైడ్​ చేశారు. లక్ష్మీనారాయణ కాలనీలోని శ్రీ లక్ష్మీ డెయిరీ ప్రొడక్ట్స్​లో తనిఖీలు చేయగా, ఎక్స్​పైరీ అయిన ఫుడ్​ కలర్స్, ఫ్లేవర్స్, ఫంగస్​తో ఉన్న అంజీర, లేబుల్స్​ లేని రా మెటీరియల్  వినియోగిస్తున్నట్లు గుర్తించారు. 2 కిలోల ఫంగస్​తో కూడిన డ్రై అంజీర, సింథటిక్  ఫుడ్  కలర్స్, ఫ్లేవర్స్, 1.5 కిలోల లూజ్​ ఫ్రూటీ స్వాధీనం చేసుకొని సీజ్​ చేశారు. నిర్వాహకుడు ఎం.రమేశ్​ను అదుపులోకి తీసుకుని ఉప్పల్​ పోలీసులకు అప్పగించారు.