
ముంబై: ఫాలో ఆన్లోనూ బ్యాటర్లు ఫెయిల్ కావడంతో.. రంజీ ట్రోఫీలో హైదరాబాద్ భారీ ఓటమిని మూటగట్టుకుంది. ముంబైతో గురువారం ముగిసిన గ్రూప్–బి ఎలైట్ మ్యాచ్లో ఇన్నింగ్స్ 217 రన్స్ తేడాతో ఓడింది. ముంబై స్లో లెఫ్టార్మ్ బౌలర్ షామ్స్ ములానీ (11/176) రెండు ఇన్నింగ్స్ల్లో హైదరాబాద్ను దెబ్బకొట్టాడు. దీంతో 173/6 ఓవర్నైట్ స్కోరుతో గురువారం ఆట కొనసాగించిన హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్లో 65.1 ఓవర్లలో 214 రన్స్కు ఆలౌటైంది. రోహిత్ రాయుడు (77) మినహా అందరూ విఫలమయ్యారు.
తర్వాత ఫాలో ఆన్ ఆడిన హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్లోనూ 67.2 ఓవర్లలో 220 రన్స్కే కుప్పకూలింది. రాహుల్ బుద్ది (65), కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (39), తనయ్ త్యాగరాజన్ (39 నాటౌట్) కాసేపు పోరాడినా.. మిగతా వారు పెవిలియన్కు క్యూ కట్టారు. తనుష్ కొటైన్ 5 వికెట్లు తీశాడు. ఆడిన రెండు మ్యాచ్ల్లో హైదరాబాద్ ఓ డ్రా, ఓ ఓటమితో ఒక్క పాయింట్ను ఖాతాలో వేసుకుంది.