తార్నాక జంక్షన్​పై యూటర్న్.. 50 రోజుల పరిశీలన తర్వాత క్లోజ్​

తార్నాక జంక్షన్​పై యూటర్న్..  50 రోజుల పరిశీలన తర్వాత క్లోజ్​
  • ట్రాఫిక్ ​జామ్​ సమస్య  ఏర్పడడంతో నిర్ణయం  
  • టెక్నికల్ ​స్టడీ, పబ్లిక్ ​ఒపీనియన్​ ఆధారంగా జంక్షన్​ మూసివేత

హైదరాబాద్ సిటీ, వెలుగు: సుమారు రెండు నెలల కింద తెరిచిన తార్నాక జంక్షన్ ను శుక్రవారం నుంచి మళ్లీ మూయనున్నారు. మునుపటి లాగే యూటర్న్​ద్వారా వాహనాలను మళ్లించనున్నారు. ట్రాఫిక్​మేనేజ్​మెంట్​లో భాగంగా ఎనిమిదేండ్ల కింద తార్నాక ట్రాఫిక్​జంక్షన్​ను మూసేసిన అధికారులు కిలోమీటర్​దూరంలో యూటర్న్ ఏర్పాటు చేశారు. 

దీనివల్ల ఓయూ నుంచి హబ్సిగూడ వైపు, లాలాపేట్​ వైపు వెళ్లడానికి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. దీంతో తార్నాక జంక్షన్​ను తిరిగి ఓపెన్​చేయాలనే డిమాండ్​రావడంతో ట్రాఫిక్, బల్దియా అధికారులు పరిశీలన జరిపి ట్రయల్​రన్​లో భాగంగా ఏప్రిల్18న ఓపెన్​చేశారు. మే 2 వరకు ట్రయల్​రన్ నిర్వహిస్తామని ప్రకటించారు.  

15 రోజుల ట్రయల్ ​రన్ ​సరిపోలే...

మే 2 వరకు ట్రయల్​రన్​నిర్వహించిన అధికారులు ఒక స్పష్టతకు రాలేకపోయారు. ఓయూ నుంచి వస్తూ హబ్సిగూడ, లాలాపేట్ వైపు వెళ్లేవారు,  హబ్సిగూడ నుంచి వస్తూ లాలాపేట్ వైపు వెళ్లేవారు ట్రాఫిక్​సిగ్నల్స్​ద్వారా సంతృప్తిగా ఉన్నారా లేదా అన్నది తేల్చలేకపోయారు. దీంతో మే 3 నుంచి నిరవధికంగా ట్రయల్​రన్​నిర్వహించాలని నిర్ణయించారు. అందులో వచ్చే ఫలితాలను బట్టి ఓపెన్​చేసే ఉంచాలా? లేక క్లోజ్​ చేయాలా అన్నది డిసైడ్​అవ్వొచ్చని భావించారు. 

ట్రయల్​రన్​సందర్భంగా అక్కడ ఆగిన వాహనదారుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. అందులో జంక్షన్​ను ఓపెన్​గానే ఉంచాలని కొందరు, వద్దని..సిగ్నల్స్​దగ్గర ట్రాఫిక్​జామ్​అవుతోందని, వెంటనే క్లోజ్​చేయాలని ఇంకొందరు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. 

పోల్​లోనూ 50–50  

సిగ్నల్స్​దగ్గర ఆగిన వాహనదారుల నుంచి భిన్నాభిప్రాయాలు రావడంతో మెజార్టీ ప్రజల ఒపీనియన్​తెలుసుకునేందుకు ట్రాఫిక్​పోలీసులు పోల్​నిర్వహించారు. సోషల్​మీడియా ద్వారా ‘తార్నాక జంక్షన్​ ఓపెన్​గా ఉంచాలా? లేక క్లోజ్​చేయాలా? మీరేమటారు?’ అని సిటిజన్లను అడిగారు. 

అయితే, ఆశ్చర్యకరంగా 50 శాతం మంది క్లోజ్​చేయాలని, మరో 50శాతం మంది ఓపెన్​ గానే ఉంచాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేక పోయారు. ట్రయల్​రన్​పీరియడ్​ను నిరవధికంగా కొనసాగిస్తూనే టెక్నికల్​స్టడీ చేయాలని డిసైడయ్యారు.  

తేలింది ఏమిటంటే.. 

ట్రయల్​రన్, అభిప్రాయ సేకరణ, పోల్​లో ఏం చేయాలన్నది కొలిక్కిరాకపోవడంతో పోలీసులు టెక్నికల్​స్టడీకి చేశారు. దీని కోసం డ్రోన్లను ఉపయోగించి ట్రాఫిక్​ఫొటోలు, వీడియోలు తీసి పరిశీలించారు. గూగుల్​ట్రాఫిక్​డాటాను విశ్లేషించారు. ఇందులో తార్నాక జంక్షన్​వద్ద ట్రాఫిక్​ఎలా ఉందో పరిశీలించారు. ట్రాఫిక్​సిగ్నల్​టైమింగ్స్​ను ఒకసారి తక్కువ సెకన్లకు, మరోసారి ఎక్కువ సెకన్లకు మార్చి ట్రాఫిక్ ​మూవ్​మెంట్​ఎలా వెళ్తుందో చూశారు. 

దీంతో పాటు రోడ్​ఇంజినీరింగ్​కోణాల్లో కూడా అధ్యయనం చేశారు. వీటన్నింటి ద్వారా ఓయూ నుంచి వచ్చే వాహనాలతో పాటు హబ్సిగూడ నుంచి వచ్చే వెహికల్స్​ఎక్కువ జామ్​అవుతున్నట్టు తెలుసుకున్నారు. ఓయూ నుంచి ఉన్న రోడ్డు జంక్షన్​వద్ద ఇరుకుగా మారడంతో ఎక్కువ ట్రాఫిక్​జామ్​అవుతోందని గుర్తించారు. దీనివల్ల ఫ్రీ లెఫ్ట్​లో వెళ్లాల్సిన వాహనాలు కూడా ఆగిపోతున్నాయి. ఈ ఎఫెక్ట్​ఇఫ్లూ దగ్గర సీతాఫల్​మండి వైపు వెళ్లే చౌరస్తా వరకూ కొనసాగుతోంది. వీటన్నిటిని పరిశీలించి తార్నాక ను క్లోజ్​ చేయడమే సరైందని ఒక నిర్ణయానికి వచ్చారు.

మిగతా ప్రాంతాల్లో కావట్లే..

ఎక్కువ శాతం నగరంలో సిగ్నల్స్​దగ్గర రోడ్డు ఇరుకుగా ఉన్న ప్రాంతాల్లోనే ట్రాఫిక్​జామ్స్​అవుతున్నాయి. దీనికి ఉదాహరణ తార్నాక జంక్షన్​ను చెప్పుకోవచ్చు. అదే రోడ్డు విస్లీర్ణం మెరుగ్గా ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్​జామ్స్​కావడం లేదు. అలాగే, నగరంలో కొన్ని యూ-టర్న్‌లు సరిపడా వెడల్పు లేకపోవడం వల్ల పెద్ద వాహనాలు తిరగడానికి ఇబ్బంది పడుతున్నాయి. దీంతో ట్రాఫిక్​జామ్స్​అవుతున్నాయి.  రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ను డెవలప్​చేసి, యూ-టర్న్ డిజైన్‌లను మార్చడం, రోడ్డు విస్తరణ చేయడం వల్ల ట్రాఫిక్​సమస్య తీరే అవకాశం ఉంటుంది.

ట్రాఫిక్​ తగ్గించడానికి చర్యలు 

తార్నాక జంక్షన్​ను 50 రోజులపాటు పరిశీలించాం. ఓపెన్​ఉంటే ట్రాఫిక్​అయి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు వర్షాకాలం..స్కూళ్లు, కాలేజీలు కూడా ఓపెన్​అవుతున్నాయి. దీంతో ట్రాఫిక్​మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలు, టెక్నికల్​ స్టడీతో జంక్షన్​ను మళ్లీ క్లోజ్​చేస్తున్నాం.
–  జోయల్​ డేవిస్, జాయింట్​ సీపీ , ట్రాఫిక్, హైదరాబాద్​