
- ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడడంతో నిర్ణయం
- టెక్నికల్ స్టడీ, పబ్లిక్ ఒపీనియన్ ఆధారంగా జంక్షన్ మూసివేత
హైదరాబాద్ సిటీ, వెలుగు: సుమారు రెండు నెలల కింద తెరిచిన తార్నాక జంక్షన్ ను శుక్రవారం నుంచి మళ్లీ మూయనున్నారు. మునుపటి లాగే యూటర్న్ద్వారా వాహనాలను మళ్లించనున్నారు. ట్రాఫిక్మేనేజ్మెంట్లో భాగంగా ఎనిమిదేండ్ల కింద తార్నాక ట్రాఫిక్జంక్షన్ను మూసేసిన అధికారులు కిలోమీటర్దూరంలో యూటర్న్ ఏర్పాటు చేశారు.
దీనివల్ల ఓయూ నుంచి హబ్సిగూడ వైపు, లాలాపేట్ వైపు వెళ్లడానికి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. దీంతో తార్నాక జంక్షన్ను తిరిగి ఓపెన్చేయాలనే డిమాండ్రావడంతో ట్రాఫిక్, బల్దియా అధికారులు పరిశీలన జరిపి ట్రయల్రన్లో భాగంగా ఏప్రిల్18న ఓపెన్చేశారు. మే 2 వరకు ట్రయల్రన్ నిర్వహిస్తామని ప్రకటించారు.
15 రోజుల ట్రయల్ రన్ సరిపోలే...
మే 2 వరకు ట్రయల్రన్నిర్వహించిన అధికారులు ఒక స్పష్టతకు రాలేకపోయారు. ఓయూ నుంచి వస్తూ హబ్సిగూడ, లాలాపేట్ వైపు వెళ్లేవారు, హబ్సిగూడ నుంచి వస్తూ లాలాపేట్ వైపు వెళ్లేవారు ట్రాఫిక్సిగ్నల్స్ద్వారా సంతృప్తిగా ఉన్నారా లేదా అన్నది తేల్చలేకపోయారు. దీంతో మే 3 నుంచి నిరవధికంగా ట్రయల్రన్నిర్వహించాలని నిర్ణయించారు. అందులో వచ్చే ఫలితాలను బట్టి ఓపెన్చేసే ఉంచాలా? లేక క్లోజ్ చేయాలా అన్నది డిసైడ్అవ్వొచ్చని భావించారు.
ట్రయల్రన్సందర్భంగా అక్కడ ఆగిన వాహనదారుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. అందులో జంక్షన్ను ఓపెన్గానే ఉంచాలని కొందరు, వద్దని..సిగ్నల్స్దగ్గర ట్రాఫిక్జామ్అవుతోందని, వెంటనే క్లోజ్చేయాలని ఇంకొందరు అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
పోల్లోనూ 50–50
సిగ్నల్స్దగ్గర ఆగిన వాహనదారుల నుంచి భిన్నాభిప్రాయాలు రావడంతో మెజార్టీ ప్రజల ఒపీనియన్తెలుసుకునేందుకు ట్రాఫిక్పోలీసులు పోల్నిర్వహించారు. సోషల్మీడియా ద్వారా ‘తార్నాక జంక్షన్ ఓపెన్గా ఉంచాలా? లేక క్లోజ్చేయాలా? మీరేమటారు?’ అని సిటిజన్లను అడిగారు.
అయితే, ఆశ్చర్యకరంగా 50 శాతం మంది క్లోజ్చేయాలని, మరో 50శాతం మంది ఓపెన్ గానే ఉంచాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేక పోయారు. ట్రయల్రన్పీరియడ్ను నిరవధికంగా కొనసాగిస్తూనే టెక్నికల్స్టడీ చేయాలని డిసైడయ్యారు.
తేలింది ఏమిటంటే..
ట్రయల్రన్, అభిప్రాయ సేకరణ, పోల్లో ఏం చేయాలన్నది కొలిక్కిరాకపోవడంతో పోలీసులు టెక్నికల్స్టడీకి చేశారు. దీని కోసం డ్రోన్లను ఉపయోగించి ట్రాఫిక్ఫొటోలు, వీడియోలు తీసి పరిశీలించారు. గూగుల్ట్రాఫిక్డాటాను విశ్లేషించారు. ఇందులో తార్నాక జంక్షన్వద్ద ట్రాఫిక్ఎలా ఉందో పరిశీలించారు. ట్రాఫిక్సిగ్నల్టైమింగ్స్ను ఒకసారి తక్కువ సెకన్లకు, మరోసారి ఎక్కువ సెకన్లకు మార్చి ట్రాఫిక్ మూవ్మెంట్ఎలా వెళ్తుందో చూశారు.
దీంతో పాటు రోడ్ఇంజినీరింగ్కోణాల్లో కూడా అధ్యయనం చేశారు. వీటన్నింటి ద్వారా ఓయూ నుంచి వచ్చే వాహనాలతో పాటు హబ్సిగూడ నుంచి వచ్చే వెహికల్స్ఎక్కువ జామ్అవుతున్నట్టు తెలుసుకున్నారు. ఓయూ నుంచి ఉన్న రోడ్డు జంక్షన్వద్ద ఇరుకుగా మారడంతో ఎక్కువ ట్రాఫిక్జామ్అవుతోందని గుర్తించారు. దీనివల్ల ఫ్రీ లెఫ్ట్లో వెళ్లాల్సిన వాహనాలు కూడా ఆగిపోతున్నాయి. ఈ ఎఫెక్ట్ఇఫ్లూ దగ్గర సీతాఫల్మండి వైపు వెళ్లే చౌరస్తా వరకూ కొనసాగుతోంది. వీటన్నిటిని పరిశీలించి తార్నాక ను క్లోజ్ చేయడమే సరైందని ఒక నిర్ణయానికి వచ్చారు.
మిగతా ప్రాంతాల్లో కావట్లే..
ఎక్కువ శాతం నగరంలో సిగ్నల్స్దగ్గర రోడ్డు ఇరుకుగా ఉన్న ప్రాంతాల్లోనే ట్రాఫిక్జామ్స్అవుతున్నాయి. దీనికి ఉదాహరణ తార్నాక జంక్షన్ను చెప్పుకోవచ్చు. అదే రోడ్డు విస్లీర్ణం మెరుగ్గా ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్జామ్స్కావడం లేదు. అలాగే, నగరంలో కొన్ని యూ-టర్న్లు సరిపడా వెడల్పు లేకపోవడం వల్ల పెద్ద వాహనాలు తిరగడానికి ఇబ్బంది పడుతున్నాయి. దీంతో ట్రాఫిక్జామ్స్అవుతున్నాయి. రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను డెవలప్చేసి, యూ-టర్న్ డిజైన్లను మార్చడం, రోడ్డు విస్తరణ చేయడం వల్ల ట్రాఫిక్సమస్య తీరే అవకాశం ఉంటుంది.
ట్రాఫిక్ తగ్గించడానికి చర్యలు
తార్నాక జంక్షన్ను 50 రోజులపాటు పరిశీలించాం. ఓపెన్ఉంటే ట్రాఫిక్అయి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు వర్షాకాలం..స్కూళ్లు, కాలేజీలు కూడా ఓపెన్అవుతున్నాయి. దీంతో ట్రాఫిక్మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలు, టెక్నికల్ స్టడీతో జంక్షన్ను మళ్లీ క్లోజ్చేస్తున్నాం.
– జోయల్ డేవిస్, జాయింట్ సీపీ , ట్రాఫిక్, హైదరాబాద్