
ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్(జీజేసీ) అక్టోబర్12 నుంచి 17 వరకు నిర్వహించనున్న ఇండియా జ్యువెలరీ షాపింగ్ ఫెస్టివల్కు హైదరాబాద్ వేదిక కానుంది. ఐడీటీ జెమ్మోలాజికల్ లేబొరేటరీస్ వరల్డ్వైడ్ టైటిల్ స్పాన్సర్, డివైన్ సోలిటరీస్మరో స్పాన్సర్గా వ్యవహరిస్తున్నారు. జాయింట్ కన్వీనర్ మనోజ్ జా మాట్లాడుతూ... అక్టోబర్లో ఈ ఈవెంట్ను నిర్వహించనున్న తేదీల వివరాలు వెల్లడించారు. ఐజేఎస్ఎఫ్ భారత్ని ఆభరణాల షాపింగ్కు గమ్యస్థానంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
ఐదు వారాల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ది బెస్ట్ జ్యువెలర్స్ని ప్రదర్శించడం, వేలం వేయడం, అమ్మకాలను పెంచి బంగారం ఇండస్ర్టీకి మద్దతు ఇవ్వడం తద్వారా ఇండియా వారసత్వం, సంస్కృతిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దీన్ని నిర్వహిస్తున్నామన్నారు. వినియోగదారులను భాగస్వామ్యం చేయడానికి ఆఫర్లు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. రూ.25 వేల గోల్డ్ కొనుగోలుపై ఒక కూపన్ ఇవ్వనున్నట్లు వివరించారు. డిజిటల్ ఇండియాను ప్రోత్సహించేందుకు మొత్తం ప్రోగ్రాం డిజిటల్ లో పూర్తి పారదర్శకంగా జరుగుతుందని చెప్పారు.