వారంలోపు పోసిన మట్టిని తీయకుంటే కేసులే.. కాంట్రాక్టర్కు హైడ్రా కమిషనర్ స్ట్రాంగ్ వార్నింగ్

వారంలోపు పోసిన మట్టిని తీయకుంటే కేసులే.. కాంట్రాక్టర్కు హైడ్రా కమిషనర్ స్ట్రాంగ్ వార్నింగ్

హైడ్రా పేరు చెప్పి మూసీ పరీవాహకంలో మట్టి పోస్తున్న కాంట్రాక్టర్ కు కమీషనర్ రంగనాథ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వారం రోజుల్లో మూసీ పరివాహకంలో పోసిన మట్టిని తీయాలని ఆదేశించారు. వారం తర్వాత మూసీలో పోసిన  మట్టిని తొలగించకపోతే వారిపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని రంగనాథ్ హెచ్చరించారు. 

అంబర్పేట్ బతుకమ్మ కుంట పూడిక తీత మట్టిని మూసారాంబాగ్ ప్రాంతంలోని మూసీలో పోస్తున్నాడు ఓ కాంట్రాక్టర్. దీనిపై స్థానికులు ప్రశ్నించగా హైడ్రానే మట్టి మూసి లో పోసుకోమందని ల్యాండ్ ఓనర్, కాంట్రాక్టర్ బుకాయిస్తూ వస్తున్నారు. ఈ వ్యవహారాన్ని V6 బయటపెట్టింది. 

మంగళవారం (జూన్ 3) బతుకమ్మ కుంట అభివృద్ధి పనులను పరిశీలించారు హైడ్రా కమిషనర్. కుంట లోకి వర్షం నీరు చేరే ఇన్ లెట్.. చెరువు నిండితే నీరు బయటకు వెళ్ళే ఔట్లెట్లను పరిశీలించారు. 
బతుకమ్మ కుంట పక్కన సాగే మురుగు, వరద కాలువ డైవర్షన్ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్ కు వార్నింగ్ ఇచ్చారు హైగ్రా కమిషనర్.