పసుమాములలో హైడ్రా కూల్చివేతలు రూ.15 కోట్ల స్థలం సేఫ్

పసుమాములలో హైడ్రా కూల్చివేతలు రూ.15 కోట్ల స్థలం సేఫ్

ఎల్బీనగర్, వెలుగు: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాగోల్ సర్కిల్ పసుమాములలో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు శుక్రవారం నేలమట్టం చేశారు. పసుమాముల గ్రామ సర్వే నంబర్ 454లో కలింగరావు అనే వ్యక్తి కాలనీ రోడ్లను కబ్జా చేసి, ప్లాట్లుగా మార్చినట్లు శ్రీకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు.

దీనిపై స్పందించిన హైడ్రా.. భారీ పోలీస్ బందోబస్తు నడుమ అక్రమ నిర్మాణాలను శుక్రవారం కూల్చివేసింది. సుమారు రూ. 15 కోట్ల విలువైన స్థలాన్ని కాపాడి బాధితులకు అప్పగించింది. తమకు న్యాయం చేసినందుకు నివాసితులు హర్షం వ్యక్తం చేస్తూ.. సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రా కమిషనర్​కు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.