
హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝులిపిస్తోంది. జూన్ 30న తెల్లవారుజాము నుంచే మాదాపూర్ లోని సున్నం చెరువులోని ఆక్రమణలను తొలగిస్తోంది హైడ్రా. చెరువు ఎఫ్ టి ఎల్ పరిధిలో ఉన్న గుడిసెలను తొలగిస్తోంది. చెవుల పునరుద్ధరణలో భాగంగా రూ.10 కోట్లతో సున్నం చెరువును అభివృద్ధి చేస్తోంది హైడ్రా . 32 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సున్నం చెరువులో భారీగా ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించిన హైడ్రా అధికారులు వాటిని తొలగిస్తున్నారు. చెరువు సమీపంలో అక్రమంగా వేసిన బోరు మోటార్లను కూడా తొలగిస్తోంది హైడ్రా.
సున్నం చెరువు సమీపంలో ఏళ్ల తరబడి జోరుగా అక్రమ నీటి వ్యాపారం జరుగుతోంది. ఇటీవల సున్నం చెరువు పరిధిలోని భూగర్భ జలాలను వినియోగించవద్దని హైడ్రా సూచించిన సంగతి తెలిసిందే. సున్నం చెరువులో ప్రమాదకరమైన రసాయనాలు చేరుతున్నాయని హైడ్రా తన పరిశోధనలతో తేల్చింది. కలవరపడాల్సిన విషయం ఏమిటంటే ఈ చెరువు పక్కన మూడు బోర్లు వేసిన ఓ వ్యక్తి ఈ నీళ్లను ట్యాంకర్ల ద్వారా మాదాపూర్లోని పలు ఐటీ కంపెనీలు, ప్రైవేట్ హాస్టల్స్, విద్యా సంస్థలు, హోటల్స్ కు సరఫరా చేస్తున్నట్టు తెలిసింది.
ఇందులో కొందరు ప్రైవేట్ హాస్టల్స్, హోటల్స్ నిర్వాహకులు ఈ నీటిని ప్యూరిఫై చేసి తాగడానికి ఉపయోగిస్తుండగా, ఐటీ కంపెనీలు, విద్యాసంస్థలు ఇతర పనులకు ఉపయోగిస్తున్నట్టు సమాచారం. ఇక్కడి హాస్టల్స్లో వేల మంది స్టూడెంట్స్, జాబర్స్ఉంటున్నారు. ఐటీ కంపెనీల్లో సాఫ్ట్వేర్జాబ్స్చేసేవారితో పాటు ఐఐటీ, మెడికల్కోచింగ్ తీసుకునే పిల్లలు ఎంతోమంది ఉన్నారు. సున్నం చెరువు నీళ్ల సరఫరా విషయం బయటపడడంతో ఇప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతున్నది. కాగా, బోర్లు వేసి నీటి సరఫరా చేస్తున్న వ్యక్తిపై హైడ్రా కేసు నమోదు చేసింది.