మలక్ పేట నల్గొండ చౌరస్తాలో డ్రైనేజీ పైప్ లైన్​ లీకేజీ పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

మలక్ పేట నల్గొండ చౌరస్తాలో డ్రైనేజీ పైప్ లైన్​ లీకేజీ పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

మలక్ పేట/జీడిమెట్ల, వెలుగు: మలక్ పేట నల్గొండ చౌరస్తాలోని అక్బర్ ప్లాజా వద్ద నేషనల్​హైవేపై డ్రైనేజీ పైప్​లైన్ పగిలి మూడు రోజులుగా మురుగునీరు పొంగిపొర్లుతోంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్, బల్దియా కమిషనర్ ఆర్వీ కర్ణన్, వాటర్​బోర్డు ఈడీ మయాంక్ మిట్టల్, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ తో కలిసి శనివారం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. మెట్రో పిల్లర్​నంబర్​1417 -నుంచి 1420 మ‌ధ్య స‌మ‌స్య త‌లెత్తినట్లు గుర్తించారు. వ‌ర్షం ప‌డిన ప్రతిసారి ఈ స‌మ‌స్య త‌లెత్తుతోందని స్థానికులు తెలపగా, ప‌రిష్కార మార్గాలపై అక్కడే చ‌ర్చించారు. 

దాదాపు వంద మీట‌ర్ల మేర ఉన్న పైపు లైనులో పేరుకుపోయిన నిర్మాణ వ్యర్థాలు, చెత్తను తొల‌గించ‌డానికి  హైప్రెజ‌ర్ జెట్టింగ్ మిష‌న్లతో ప్రయ‌త్నించాల‌ని సూచించారు. లేని ప‌క్షంలో ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఏర్పడ‌కుండా కొత్త పైపు లైన్​ నిర్మాణ ప‌నుల‌ను యుద్ధప్రాతిప‌దిక‌న చేయాల‌ని కమిషనర్లు ఏవీ రంగనాథ్, ఆర్వీ కర్ణన్​నిర్ణయించారు. డ్రైనేజీ పైప్ లైన్ సమస్య పరిష్కారం అయ్యేవరకు పరిస్థితి ఇలాగే ఉంటుందని, వాహనదారులు ప్రత్యామ్నాయం చూసుకోవాలని జోయల్​డేవిస్​సూచించారు. 

మలక్ పేట, చాదర్​ఘాట్ రోడ్డు వైపు మరో వారం పాటు రాకపోకలు సాగించవద్దన్నారు. అలాగే కుత్బుల్లాపూర్​లోని చారిత్రక ఫాక్స్ సాగర్​ను చెరువును కమిషనర్లు ఆర్.వి.కర్ణన్, రంగనాథ్​పరిశీలించారు. నేషనల్ హైవే 44 నుంచి చింతల్​వరకు చేపట్టనున్న రోడ్డు వెడల్పు పనులతోపాటు ఫాక్స్​సాగర్​చెరువు నుంచి కెమికల్​నాలా వరకూ చేపట్టిన మురుగు నీరు మళ్లింపు పనులను పరిశీలించారు.