- శంషాబాద్ ఎయిర్పోర్టులో ఘటన
శంషాబాద్, వెలుగు: శంషాబాద్ ఎయిర్పోర్టులో రూ.9.50 కోట్ల విలువైన హైడ్రోఫోనిక్ గంజాయిని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి శనివారం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న థాయ్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్లో తనిఖీలు చేపట్టారు.
ఏడుగురు ప్రయాణికులు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు. వారి ట్రాలీ బ్యాగుల్లో చూడగా.. 27.15 కేజీల హైడ్రోఫోనిక్గంజాయి లభ్యమైంది. నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
