పాక్‌‌ క్రికెటర్లకు నేను తల్లిని కాను : సానియా

పాక్‌‌ క్రికెటర్లకు నేను తల్లిని కాను : సానియా

న్యూఢిల్లీ: చిరకాల ప్రత్యర్థి ఇండియా చేతిలో ఓటమి ఎదురైన తర్వాత తమపై విమర్శలు చేసిన నటి వీణా మాలిక్‌‌కు ప్రముఖ టెన్నిస్‌‌ ప్లేయర్‌‌ సానియా మీర్జా ఘాటుగా సమాధానమిచ్చింది. తన కొడుకును హుక్కా తాగేలాంటి ప్రమాదకరమైన ప్రదేశాలకు తీసుకెళ్లలేదని, దీనిపై ఎవరికీ ఎలాంటి ఆందోళన అవసరం లేదని పేర్కొంది. తనకన్నా మిన్నగా మరెవరూ తన కొడుకుకు ప్రేమించలేదని తెలిపింది.

తాను పాకిస్థాన్‌‌ టీమ్‌‌ తల్లిని లేదా డైటిషియన్‌‌ లేదా టీచర్‌‌నుకానని సానియా ట్వీట్‌‌ చేసింది. ఇండియా మ్యాచ్‌‌కు ముందు తన భర్త, పాక్‌‌ వెటరన్‌‌ ప్లేయర్‌‌ షోయబ్‌‌ మాలిక్‌‌, సహచర క్రికెటర్లు ఇమద్‌‌ వసీమ్‌‌, వాహబ్‌‌ రియాజ్‌‌తో కలిసి సానియా హోటల్‌‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. దీనిపై సోషల్‌‌ మీడియాలో ఒక రేంజ్​లో ట్రోలింగ్‌‌ జరిగింది. మరోవైపు మాలిక్‌‌ ఈ వ్యవహారం స్పందిస్తూ మీడియా, అభిమానులు క్రికెటర్ల కుటుంబాలకు గౌరవమివ్వాలని ట్వీట్‌‌ చేశాడు.