రూ.118 కోట్లకు లెక్క చెప్పండి : చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు..?

రూ.118 కోట్లకు లెక్క చెప్పండి : చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు..?

 చంద్రబాబు నాయుడుకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. అమరావతి కాంట్రాక్టర్ లు అయిన షాపూర్జి పల్లోంజి (ఎస్ పి సి ఎల్), ఎల్ అండ్ టి సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా చంద్రబాబుకు 118 కోట్ల ముడుపులు ముట్టాయి. ఈ క్రమంలో చంద్రబాబుకు ఐటీ శాఖ అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నోటీసులపై చంద్రబాబు పలు  అభ్యంతరాలను ఐటీ శాఖ అధికారుల ముందు ఉంచగా..వాటిని ఐటీ శాఖ తిరస్కరించినట్లు సమాచారం. 

 షాపూర్జి పల్లోంజి (ఎస్ పి సి ఎల్), ఎల్ అండ్ టి సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా చంద్రబాబుకు ఈ  ముడుపులు ముట్టాయి.  ఫోనిక్స్ ఇన్ఫ్రా& పౌర్ ట్రేడింగ్ అనే  సబ్ కాంట్రాక్టు సంస్థ ద్వారా నగదు మళ్లింపు జరిగినట్లు తేలింది. 2016లో చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ద్వారా మనోజ్ వాసుదేవ్ టచ్లోకి వెళ్లగా..  శ్రీనివాస్ ద్వారానే సబ్ కాంట్రాక్టుల సంస్థల నుంచి చంద్రబాబు ముడుపులు అందుకున్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబు బోగస్ సబ్ కాంట్రాక్టు సంస్థల ద్వారా  ముడుపులు పొందినట్లు ఆదాయ పన్ను శాఖ  అధికారులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. మనోజ్ వాసుదేవ్ పార్థసాని నివాసాల్లో తనిఖీల సమయంలోఈ  ముడుపుల వ్యవహారం  విషయం  వెలుగులోకి వచ్చింది.  బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్ల ద్వారా  నగదు స్వాహా చేసినట్లు మనోజ్ వాసుదేవ్ (ఎంవిపి) ఒప్పుకున్నారట. 

అయితే ఐటీ నోటీసులపై చంద్రబాబు అభ్యంతరాలను తిరస్కరించిన తర్వాత.. ఆగష్టు 4వ తేదీనే హైదరాబాద్‌ ఐటీ సెంట్రల్‌ సర్కిల్‌ కార్యాలయం సెక్షన్ 153C కింద ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.  సంస్థల నుంచి చంద్రబాబుకు  వచ్చిన రూ. 118 కోట్ల మొత్తాన్ని బహిర్గతం కాని ఆదాయంగా పరిగణించడం, చట్టం ప్రకారం ప్రాసెస్ చేయబడుతుందనే అంశాలను నోటీసుల్లో ఐటీ శాఖ ప్రస్తావించింది. 

చంద్రబాబుకు అమరావతి కాంట్రాక్టర్ లు  షాపూర్జి పల్లోంజి (ఎస్ పి సి ఎల్), ఎల్ అండ్ టి సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా రూ. 118 కోట్ల ముడుపులు ముట్టాయని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. చంద్రబాబు ముడుపుల అంశం  ప్రస్తుతం  రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.