దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బ్యాంకుల్లో 7855 క్లర్క్ పోస్టుల భర్తీకి IBPS నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ ఏడాది జూలైలో రిలీజ్ చేసిన నోటిఫికేషన్ను సవరించి IBPS ఇప్పుడు తాజాగా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2021 అక్టోబర్ 7న ప్రారంభమైంది. అభ్యర్థులు 2021 అక్టోబర్ 27 లోగా దరఖాస్తు చేయాలి. జూలై 12 నుంచి 14 మధ్య అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు.
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్మెన్కు రూ.175, ఇతర అభ్యర్థులు రూ.850 ఫీజు చెల్లించాలి.
ఫీజు చెల్లించి దరఖాస్తు సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని భద్రపర్చుకోవాలి.
వెబ్ సైట్: https://ibpsonline.ibps.in/crpcl11jun21/