
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన మూడో టెస్టు వేదిక ఇండోర్ పిచ్ రేటింగ్ను ఐసీసీ మార్చింది. బీసీసఐ అభ్యర్థన మేరకు ఇండోర్ పిచ్ రేటింగ్ను ఐసీసీ సవరించింది. గతంలో ఇచ్చిన ‘పూర్’ రేటింగ్ని సవరించి ‘బిలీ యావరేజ్’గా మార్చింది. ఈ మేరకు ఐసీసీ జనరల్ మేనేజర్ వసీం ఖాన్, ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ సభ్యుడు రోజర్ హర్పర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
బీసీసీఐ అభ్యర్థన..
ఇండోర్ పిచ్ అధ్వాన్నంగా ఉందని చెప్పి..ఐసీసీ మూడు డీ మెరిట్ పాయింట్లు విధించిన ఐసీసీ దిగొచ్చింది. బీసీసీఐ సమర్పించిన ఇండోర్ టెస్టు పుటేజీ పరిశీలించిన అత్యున్నత క్రికెట్ మండలి అప్పీల్ ప్యానెల్ పిచ్ను ‘బిలో యావరేజ్’గా ప్రకటించింది.
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో టెస్టు కేవలం మూడు రోజుల్లోనే ముగిసింది. పిచ్పై బంతి విపరీతంగా టర్న్ కావడంతో రెండు రోజుల్లోనే 30 వికెట్లు పడ్డాయి. ఇందులో 25 వికెట్లు స్పిన్నర్లకే దక్కాయి. ఈ పిచ్ పై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో మ్యాచ్ రిఫరీ సిఫార్సు మేరకు ఈ పిచ్ కు ఐసీసీ పూర్ రేటింగ్ ఇచ్చింది. అంతేకాదు స్టేడియం ఖాతాలో మూడు డీమెరిట్ పాయింట్లు కూడా చేర్చింది. అయితే దీనిని బీసీసీఐ సవాలు చేసింది. దీనిపై స్పందించిన ఐసీసీ రేటింగ్ మార్చింది. పూర్ బదులు సగటు కన్నా తక్కువ రేటింగ్ ఇచ్చింది. అంటే డీ మెరిట్ పాయింట్ల సంఖ్య 3 నుంచి ఒకటికి తగ్గింది.
ఇండోర్ టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో గెలిచింది. మూడో రోజు లంచ్ లోపే ఆట ముగియడంతో మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ ఐసీసీకి రిపోర్ట్ చేశాడు. పిచ్ చాలా పొడిగా ఉంది. బ్యాటర్లకు.. బౌలర్లకు సమానంగా సహకరించలేదు. మొదటి నుంచే స్పిన్నర్లకు అనుకూలించిందని తెలిపాడు. దీంతో ఇండోర్ పిచ్ అధ్వాన్నంగా ఉందని ఐసీసీ పేర్కొంది. అంతేకాదు మూడు డీమెరిట్ పాయింట్లు కూడా విధించింది. ఐసీసీ నిర్ణయంపై బీసీసీఐ అప్పీల్ చేసింది. దీంతో ఐసీసీ ప్యానెల్ పూర్ రేటింగ్ నుంచి బిలో యావరేజ్ రేటింగ్ ఇచ్చింది.