నీళ్లియ్యకుంటే..  బాహుబలి మోటర్లు పేల్చేస్తాం

నీళ్లియ్యకుంటే..  బాహుబలి మోటర్లు పేల్చేస్తాం
  • చొప్పదండి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సత్యం

చొప్పదండి, వెలుగు: కాళేశ్వరం నీళ్లతో మొదట చొప్పదండిలోని అన్ని మండలాల పొలాలను తడిపాకే సీఎం కేసీఆర్ తన జిల్లాకు తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ మేడిపల్లి సత్యం డిమాండ్చేశారు. లేకుంటే రామడుగు మండలం లక్ష్మీపూర్లోని ఫస్ట్ పంప్ హౌస్ బాహుబలి మోటార్లను పేల్చేస్తామని హెచ్చరించారు. మల్లన్నపల్లి గ్రామంలో నీళ్లు అందక ఎండిపోతున్న పంటపొలాలను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ.. కాళేశ్వరం నీళ్లతో చొప్పదండిని మరో కోనసీమ చేస్తామన్న స్థానిక ఎమ్మెల్యే, జిల్లా మంత్రులకు ఎండిపోతున్న వేల ఎకరాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పంట చేతికొచ్చే టైంలో నీళ్లు అందకపోతే దిగుబడి రాక రైతులు అప్పులు పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎకరానికి రూ.50వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్నాయకులు పద్మాకర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, రాజేశం, ఎంపీటీసీ కట్టెకోల తార తదితరులు పాల్గొన్నారు.