
అంబర్పేట, వెలుగు: తనను గెలిపిస్తే అంబర్ పేట సెగ్మెంట్లో డ్రైనేజీ సిస్టమ్ను బాగుచేస్తానని కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ రోహిన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సెగ్మెంట్ పరిధిలోని శివాజీనగర్, కిశోర్ థియేటర్, రెడ్డి కాలేజీ, బ్యాంక్ ఆఫ్ బరోడా ఏరియాల్లో ఆయన పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడిని అక్కడి సమస్యలను తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంబర్ పేట నుంచి గతంలో గెలిచిన ఎమ్మెల్యేలు అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. కనీసం మౌలిక సదుపాయాలు కల్పించలేదని రోహిన్ రెడ్డి మండిపడ్డారు. సెగ్మెంట్లో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి వ్యవస్థ అధ్వానంగా మారిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలుచేస్తామన్నారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.