మే 17 నుంచి ఐజీబీసీ ప్రాపర్టీ షో

మే 17 నుంచి ఐజీబీసీ ప్రాపర్టీ షో

హైదరాబాద్‌‌, వెలుగు: సీఐఐకి చెందిన ఇండియన్ గ్రీన్ బిల్డింగ్‌‌ కౌన్సిల్‌‌ (ఐజీబీసీ) తమ రెండో ఏడిషన్ గ్రీన్ ప్రాపర్టీ షోను ఈ నెల 17 న ప్రారంభించనుంది.  19 వరకు ఈ ఎగ్జిబిషన్ ఓపెన్‌‌లో ఉంటుంది. ఉదయం 10 నుంచి 8 వరకు ప్రాపర్టీ షో ఓపెన్‌‌లో ఉంటుందని, బయ్యర్లు వచ్చి తమకు నచ్చిన ప్రాపర్టీల గురించి తెలుసుకోవచ్చని  ఐజీబీసీ పేర్కొంది. ఈ ప్రాపర్టీ షో  హైదరాబాద్‌‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్‌‌ గ్రౌండ్‌‌లో నిర్వహించనున్నారు. 

ఐజీబీసీ రేటింగ్ పొందిన ప్రాపర్టీలను బయ్యర్లు ముందుకు తీసుకురావడం ఆనందంగా ఉందని  ఈ సంస్థ నేషనల్  వైస్‌‌ చైర్మన్‌‌ సీ శేఖర్ రెడ్డి అన్నారు. పర్యావరణ అనుకూలమైన ప్రాజెక్ట్‌‌లు తెచ్చేందుకు డెవలపర్లు ఆసక్తి చూపిస్తున్నారని,  డిమాండ్ పెరిగిందని అన్నారు. ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షో మొదటి ఎడిషన్ పెద్ద సక్సెస్ సాధించిందని ఐజీబీసీ హైదరాబాద్‌‌ చాప్టర్‌‌‌‌ చైర్మన్ శ్రీనివాస్ మూర్తి పేర్కొన్నారు. గ్రీన్ బిల్డింగ్‌‌  ప్రాజెక్ట్‌‌లు తీసుకురావడంలో ఇండియా నెంబర్ 2 పొజిషన్‌‌లో ఉందని, ఇందులో తెలంగాణ రాష్ట్రం కీలకంగా ఉందని వివరించారు.  రాష్ట్రంలో మొత్తం 825 ఐజీబీసీ గ్రీన్ రేటెడ్ ప్రాజెక్ట్‌‌లు ఉన్నాయని చెప్పారు.