అల్వాల్ లో మద్యం మత్తులో యువకుల వీరంగం

అల్వాల్ లో మద్యం మత్తులో యువకుల వీరంగం

హైదరాబాద్ అల్వాల్ లో కొందరు యువకులు హంగామా చేశారు. శ్వేతా బార్ అండ్ రెస్టారెంట్ లో పూటుగా మద్యం తాగి వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో బార్ మొత్తం ధ్వంసం చేశారు. అడ్డు వచ్చిన వారిపై దాడికి యత్నించారు. బార్ లో ఉన్న మద్యం బాటిళ్లను పగులగొట్టినట్టు తెలుస్తోంది. యువకులు మద్యం తాగిన తర్వాత గంజాయి సేవించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. 


 
మద్యం తాగిన అనంతరం యువకులు బార్ పై దాడి చేయగా అడ్డుకునేందుకు అక్కడే ఉన్న కొందరు ప్రయత్నించారు. కానీ కర్రలు, రాళ్లు తీసుకుని మీదకు రావడంతో ఎవరూ వారిని ఆపేందుకు సాహసం చేయలేదు. యువకులను ఎంత వారించినా వినిపించుకోలేదు. ఇక చేసేది ఏమీ లేక పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్ కు చేరుకున్న పోలీసులు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని వెంకటాపురానికి చెందిన యువకులుగా గుర్తించారు. బార్ లో ఉన్న సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువకులు అలా ప్రవర్తించడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఎంత నష్టం జరిగిందనేది ఇప్పుడే చెప్పలేమంటున్నారు పోలీసులు.