రోడ్డు రోలర్ తో 72 లక్షల విలువైన మద్యాన్ని తొక్కించేశారు

రోడ్డు రోలర్ తో 72 లక్షల విలువైన మద్యాన్ని తొక్కించేశారు

ఆంధ్రప్రదేశ్ లో అక్రమ మద్యం రవాణాపై  ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. లాక్ డౌన్ సమయంలో కృష్ణా జిల్లాలోని 10 పోలీస్ స్టేషన్ల పరిధిలో స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యం సీసాలను ఇవాళ(శుక్రవారం,జులై-17) రోడ్డు రోలర్ తో తొక్కించారు ఎక్సైజ్ పోలీసులు. మచిలీపట్నంలో సుమారు 14 వేల అక్రమ మద్యం సీసాలను రోడ్డుపై పేర్చి రోడ్డు రోలర్ తో ధ్వంసం చేశారు. ఈ మద్యం విలువ రూ.72 లక్షలు ఉంటుందని తెలిపారు పోలీసులు.