జీహెచ్ఎంసీ పరిధిలో.. మెగా ఈ–శానిటేషన్ డ్రైవ్‌.. 47మెట్రిక్ టన్నుల ఈ–వేస్ట్ సేకరణ

జీహెచ్ఎంసీ పరిధిలో.. మెగా ఈ–శానిటేషన్ డ్రైవ్‌.. 47మెట్రిక్ టన్నుల ఈ–వేస్ట్ సేకరణ

హైదరాబాద్​: ఈ వేస్ట్  సేకరణలో భాగంగా జీహెచ్​ ఎంసీ పరిధిలో  మెగా ఈవేస్ట్ డ్రైవ్ ను నిర్వహించారు  అధికారులు. సోమవారం ( జనవరి 12) ఒక్కరోజే 47 మెట్రిక్ టన్నుల ఈ వ్యర్థాలను సేకరించారు. నగరంలోని 271 లోకేషన్లలో  మెగా ఈ వేస్ట్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టిన అధికారులు.. పాత మొబైల్ ఫోన్లు, ల్యాప్‌ టాప్‌ లు, కంప్యూటర్లు, టీవీలు, ప్రింటర్లు, బ్యాటరీలు, చార్జర్లు, వైర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను సేకరించారు. ఈ వ్యర్థాలను 94 ప్రత్యేక వాహనాల్లో ప్రాసెసింగ్  యూనిట్లకు తరలించారు. మంగళవారం కూడా మెగా ఈ–శానిటేషన్ డ్రైవ్ ను చేపట్టనున్నారు. 

ఈ–వ్యర్థాల సేకరణకు జీహెచ్​ ఎంసీ పరిధిలో ప్రతి సర్కిల్, డివిజన్​ లో ప్రజల దగ్గర నుంచి ఈ–వేస్ట్ ను సేకరించి ప్రత్యేక వాహనాల ద్వారాప్రాసెసింగ్ యూనిట్లకు తరలించారు. మెయిన్​ సర్కిళ్లు, మార్కెట్​ ప్రాంతాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు అధికారులు. ఇక అపార్టుమెంట్లు, గేటెడ్​ కమ్యూఇటీల్లో గ్రూప్​ కలెక్షన్​ సిస్టమ్​ ద్వారా ఈ–వేస్ట్ ను సేకరిస్తున్నారు. సేకరించిన ఈ–వేస్ట్​ ను ప్రభుత్వం  అనుమతి పొందిన రీసైక్లింగ్​ ఏజెన్సీలకు తరలించారు. 

మరో వైపు ఈ–వేస్ట్​ ను సాధారణ చెత్తతో కలపొద్దని ప్రజలకు జీహెచ్​ ఎంసీ అధికారులు సూచించారు. ఈ–వేస్ట్​ తో పర్యావరణ కాలుష్యం, భూగర్బజల కాలుష్యం జరిగి ఆనారోగ్య సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది.ఈ–డ్రైవ్​ ద్వారా సురక్షిత రీసైక్లింగ్​, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

►ALSO READ | కోరుట్లలో విషాదం.. భార్య ప్రాణం మీదకు తెచ్చిన భర్త అప్పులు !

ఈ ప్రోగ్రాంలో భాగంగా ప్రజలకు శానిటేషన్​ సిబ్బంది, ఎన్ ఫోర్స్​ మెంట్​ టీమ్స్​ తో అవగాహన కార్యక్రమాలు నిర్వహించునున్నారు. ప్రజలు స్వచ్చందంగా ముందుకు వచ్చి ఈ–వేస్ట్​ ను అప్పగించాలని జీహెచ్​ ఎంసీ సూచించింది. భవిష్యత్‌లో కూడా నిరంతర ఈ-వేస్ట్ కలెక్షన్ విధానం అమలు చేసే యోచన లో ఉన్నారు. ఈ-వేస్ట్ సరైన విధంగా నిర్వహిస్తే నగరం మరింత స్వచ్ఛంగా, సురక్షితంగా మారుతుందంటున్నారు జీహెచ్​ ఎంసీ  అధికారులు.