రైతులకు గుర్తింపును ఇచ్చేందుకు పెళ్లికొడుకు వినూత్న ఆలోచన

  రైతులకు గుర్తింపును ఇచ్చేందుకు పెళ్లికొడుకు వినూత్న ఆలోచన

రాజస్థాన్​లో ఓ పెళ్లి కుమారుడు వినూత్నంగా ఆలోచించి.. పెళ్లి కుమార్తె ఇంటికి 51 ట్రాక్టర్లతో ఊరేగింపుగా వెళ్లాడు. తానే స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ.. పెళ్లికి వచ్చిన బంధువుల్లో ఉత్సాహం నింపాడు. రాజస్థాన్​లోని బాడ్​మేర్​కు చెందిన రాధేశ్యామ్​ అనే రైతు.. తనకు కాబోయే భార్య ఇంటికి 51 ట్రాక్టర్లతో ఊరేగింపుగా వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. 

రైతులకు గుర్తింపును ఇచ్చేందుకే ఇలా పెళ్లి వేడుక నిర్వహించినట్లు పెళ్లి కుమారుడు తండ్రి సోనారామ్​ చెప్పాడు. ఈ ఊరేగింపులోసుమారు 150మంది వరకూ పాల్గొన్నారు.