- రసూలాబాద్ పంచాయతీలో ప్లాస్టిక్ నిషేధానికి తీర్మానం
కొమురవెల్లి, వెలుగు: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని రసూలాబాద్ ను సర్పంచ్పచ్చిమడ్ల స్వామి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధ గ్రామంగా శుక్రవారం ప్రకటించారు. రెండు బట్ట సంచులను ప్రతి కుటుంబానికి అందజేశారు. గ్రామ పంచాయతీకి రెండు కిలోల ప్లాస్టిక్ అప్పగిస్తే కిలో కూరగాయలు(ఉల్లిగడ్డ, టమాటా) ఇస్తామని తీర్మానం చేసి పలువురికి అందజేశారు. ఇక నుంచి మార్కెట్, కిరాణ సామగ్రికి వెళ్లినపుడు జీపీ అందించిన బట్ట సంచులను వాడాలని సూచించారు. ఎంపీపీ తలారి కీర్తన, ఎంపీడీఓ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.