- బోర్డు తిప్పేసిన ‘రైల్ వరల్డ్ ఇండియా’ కంపెనీ
గచ్చిబౌలి, వెలుగు: సాఫ్ట్వేర్ఉద్యోగాల పేరుతో ఇంటర్వ్యూలు నిర్వహించి, ట్రైనింగ్ ఇచ్చిన ఓ కంపెనీ బోర్డు తిప్పేసింది. 49 మంది నిరుద్యోగులను మోసం చేసి దాదాపు 18లక్షలు వసూలు చేసింది. రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. సిటీలో ఉండే యశ్వంత్ కు మే 9న సుస్రుత అనే యువతి కాల్ చేసింది. తాను గచ్చిబౌలి టెలికామ్నగర్లోని ‘రైల్ వరల్డ్ ఇండియా ప్రైవేట్లిమిటెడ్’ కంపెనీ హెచ్ఆర్ ని అని పరిచయం చేసుకుంది.
తమ కంపెనీలో జాబ్వేకెన్సీలు ఉన్నాయని నమ్మబలికింది. ఫ్రెషర్స్కు తామే ట్రైనింగ్ ఇచ్చి, ఉద్యోగం కల్పిస్తున్నామని వివరించింది. ఆసక్తిగా ఉంటే ఇంటర్వ్యూకు రావాలని పిలిచింది. నమ్మిన యశ్వంత్మే10న ఇంటర్వ్యూకు వెళ్లాడు. ఇంటర్వ్యూ పూర్తయ్యాక మీరు సెలెక్ట్ అయ్యారని,100 రోజులపాటు ట్రైనింగ్ ఇస్తామని, ఆ తర్వాత ఎగ్జామ్ఉంటుందని హెచ్ఆర్సుస్రుత తెలిపింది.
సెక్యూరిటీ డిపాజిట్కింద రూ.40 వేలు చెల్లించాలని, ట్రైనింగ్తర్వాత రీఫండ్చేస్తామని నమ్మించింది. మే18న యశ్వంత్ డబ్బు కట్టేందుకు కంపెనీకి వెళ్లాడు. సుస్రుతతోపాటు దీక్షా షిండే, రమ్య అనే మరో ఇద్దరు హెచ్ఆర్లుగా పరిచయం చేసుకున్నారు. సదరు కంపెనీకి బెంగుళూరులో ఉండే ప్రకాశ్ సింగ్డైరెక్టర్ అని వారు తెలియజేశారు. తర్వాత యశ్వంత్వారికి ఫోన్పే ద్వారా రూ.40వేలు చెల్లించాడు.
ఈ నెల 3న యశ్వంత్తోపాటు మరో 10 మంది ట్రైనింగ్పూర్తిచేసుకున్నారు. 13వ తేదీ వరకు ఆఫీసులోని ట్రైనింగ్సెషన్కు అటెండ్ అయ్యారు. ఆ తర్వాత రోజు నుంచి ఆఫీస్ క్లోజ్ లో ఉండడంతో తాము మోసపోయామని బాధితులు తెలుసుకున్నారు. కంపెనీ డైరెక్టర్ప్రకాశ్సింగ్, మేనేజ్మెంట్పై చర్యలు తీసుకోవాలని బుధవారం రాయదుర్గం పోలీసులను ఆశ్రయించారు.
రైల్ వరల్డ్ ఇండియా ప్రై.లిమిటెడ్కంపెనీకి హైదరాబాద్తోపాటు ముంబై, పుణె, బెంగళూరులో బ్రాంచులు ఉన్నట్లు తెలిపారు. మే నెలలో హైదరాబాద్బ్రాంచ్ ను ఓపెన్ చేశారని చెప్పారు. యశ్వంత్కలిపి మొత్తం 49 మంది బాధితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కొక్కరి నుంచి రూ.40 వేలు నుంచి రూ.50 వేలు వసూలు చేసినట్లు సమాచారం.
