ఎన్ఈపీఐడీలో హైడ్రోథెరపీ యూనిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభం

ఎన్ఈపీఐడీలో హైడ్రోథెరపీ యూనిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభం

కంటోన్మెంట్, వెలుగు :  దివ్యాంగుల సంక్షేమానికి  కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర మంత్రి  డాక్టర్​వీరేంద్ర కుమార్​ అన్నారు.  సికింద్రాబాద్​బోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి మనోవికాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని నేషనల్​ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఫర్​ది ఎంపవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్​పర్సన్స్​విత్​ఇంటలెక్చువల్​ డిసెబిలిటీ (ఎన్ఐఈపీఐడీ) కేంద్రంలో నిర్మిస్తున్న  హైడ్రోథెరపీ యూనిట్​భవన సముదాయానికి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు.  ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ..  

దివ్యాంగులకు నాణ్యమైన చికిత్స ఇంటర్వెన్షన్ ​అందించాలనే ఉద్దేశంతోనే  హైడ్రోథెరపీ యూనిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్​ఐఈపీఐడీ  డైరెక్టర్​ బీవీ రామ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ..  ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఈపీఐడీ, హాన్స్​ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న

హైడ్రోథెరపీ యూనిట్​ఈ ప్రాంతంలోని స్వచ్ఛంద సంస్థలకు మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటుందన్నారు.  పాల్సీ, మస్కులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిస్ట్రోఫీ, డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిండ్రోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మేధో వైకల్యం, ఇంద్రియ సమస్యలు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న వ్యక్తులు యూనిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ప్రయోజనం పొందవచ్చన్నారు.