కంటోన్మెంట్, వెలుగు : దివ్యాంగుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర మంత్రి డాక్టర్వీరేంద్ర కుమార్ అన్నారు. సికింద్రాబాద్బోయిన్పల్లి మనోవికాస్ నగర్లోని నేషనల్ఇన్స్టిట్యూట్ ఫర్ది ఎంపవర్మెంట్ ఆఫ్పర్సన్స్విత్ఇంటలెక్చువల్ డిసెబిలిటీ (ఎన్ఐఈపీఐడీ) కేంద్రంలో నిర్మిస్తున్న హైడ్రోథెరపీ యూనిట్భవన సముదాయానికి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ..
దివ్యాంగులకు నాణ్యమైన చికిత్స ఇంటర్వెన్షన్ అందించాలనే ఉద్దేశంతోనే హైడ్రోథెరపీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్ఐఈపీఐడీ డైరెక్టర్ బీవీ రామ్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్ఐఈపీఐడీ, హాన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న
హైడ్రోథెరపీ యూనిట్ఈ ప్రాంతంలోని స్వచ్ఛంద సంస్థలకు మోడల్గా ఉంటుందన్నారు. పాల్సీ, మస్కులర్ డిస్ట్రోఫీ, డౌన్ సిండ్రోమ్, మేధో వైకల్యం, ఇంద్రియ సమస్యలు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న వ్యక్తులు యూనిట్ నుంచి ప్రయోజనం పొందవచ్చన్నారు.