‘కల్యాణలక్ష్మి’ని కొనసాగించాలి

‘కల్యాణలక్ష్మి’ని కొనసాగించాలి

బీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించాలని ఉమ్మడి ఖమ్మం, వరంగల్​ జిల్లాల్లో సోమవారం బీఆర్ఎస్​నాయకులు ధర్నా చేశారు. 

పేదలకు ఉపయోగపడే పథకాలపై కోర్టు స్టేవిధించిందని, దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయా పథకాలను నిలిపివేసేందుకు చూస్తోందని ఆరోపించారు. పేదలకు ఉపయోగపడే పథకాలను నిలివేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. 

ఈ సందర్భంగా పలుచోట్ల సీఎం రేవంత్​రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. అనంతరం ఆఫీసర్లకు వినతిపత్రాలను అందజేశారు.-వెలుగు, నెట్​వర్క్