ములుగు/ జనగామ అర్బన్/ ఖమ్మం టౌన్/ కాశీబుగ్గ/ ఏటూరునాగారం, వెలుగు: ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో వినతులు వచ్చాయి. జనగామ కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్కు 259 ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్ సందీప్కుమార్ఝా తెలిపారు. ములుగులో మొత్తం 28 దరఖాస్తులు వచ్చాయని అడిషనల్ కలెక్టర్ సీహెచ్.మహేందర్జి చెప్పారు.
ఖమ్మం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ దివాకర ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వరంగల్గ్రీవెన్స్కు 166 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ సత్యశారద పేర్కొన్నారు. కాగా, ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన జిల్లా మార్కెటింగ్శాఖ ఆఫీసర్ సురేఖ ఫొటోకు ఆమె ఇతర ఉద్యోగులతో కలిసి నివాళులర్పించారు. ఏటూరునాగారం ఐటీడీఏ ఆఫీస్లో నిర్వహించిన గిరిజన దర్బార్కు వివిధ సమస్యలపై 25 వినతులు వచ్చాయని పీవో లెనిన్ వత్సల్టొప్పో తెలిపారు.
