సంక్రాంతికి జాతర పోదామా.. ప్రారంభమైన ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు

సంక్రాంతికి జాతర పోదామా.. ప్రారంభమైన ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు

కోర్కెలు తీర్చే కొంగు బంగారం.. వరంగల్ జిల్లా ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి(జనవరి 13) నుంచి ప్రారంభమయ్యాయి. సంక్రాంతి నుంచి ఉగాది వరకు మూడునెలల పాటు సాగే ఈ జాతరకు భక్తులు పోటెత్తారు. అధిక సంఖ్యలో మల్లన్న దర్శనానికి వచ్చే భక్తుల కోసం అధికారులు సకల సౌకర్యాలు కల్పించారు.

జాతర ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక నిధులు కేటాయించి.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ ఆదేశించింది. జాతరకు ప్రత్యేక బస్సులు, అదనపు క్యూలైన్లు, సౌచాలయాలు, తాగునీరు, చలువ పందిళ్లు వంటి మౌళిక సదూపాయాలను అధికారులు కల్పించారు.

తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు , ఛత్తీస్గఢ్ సహా విదేశాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు.