హైదరాబాద్లో కొనసాగుతున్న సోదాలు

హైదరాబాద్లో కొనసాగుతున్న సోదాలు
  • ఫార్మా కంపెనీల్లో తనిఖీలు
  • భారీగా పన్ను ఎగవేతే కారణం?

హైదరాబాద్: హైదరాబాద్ లో ఐటీ(ఆదాయపు పన్ను శాఖ) అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఒక ఫార్మా కంపెనీలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఇవాళ తెల్లవారు జామునుంచే ఆదాయపు పన్ను శాఖ అధికారులు బృందాలుగా విడిపోయి ఓ ఫార్మా కంపెనీ యజమాని, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహి స్తున్నారు.

రాయదుర్గం, మొయినాబాద్, కోకాపేట తదితర ప్రాంతాల్లో  సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి.  భారీగా ఆదాయపు పన్నును ఎగవేశారన్న ఆరోపణలతో ఫార్మా కంపెనీపై దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.  

మోయీనాబాద్‌లోని స్కిల్ ప్రమోటర్స్ ఇళల్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. శ్రీ హరి హోమ్స్ నిర్వాహకుల నివాసాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి.  పూర్తి సమాచారం తెలియల్సి ఉంది.