
ముషీరాబాద్, వెలుగు: విద్యార్థుల ఉన్నత చదువుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్చేశారు. విద్యార్థుల సంఖ్యకు తగినన్ని హాస్టళ్లు లేకపోవడంతో చాలా మంది యువత మధ్యలోనే చదువును ఆపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం వెంటనే హాస్టళ్ల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. నేషనల్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ గా ముత్తోజు శ్రీనివాస్ చారిని నియమిస్తూ ఆర్ కృష్ణయ్య శుక్రవారం విద్యానగర్ బీసీ భవన్లో నియామక పత్రం అందజేశారు. ఫీజు రీయింబర్స్మెంట్, మెస్ బిల్లులు, హాస్టల్ భవనాల అద్దె బకాయిలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని కోరారు.