
వికారాబాద్, వెలుగు: బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ నిర్వాహకుడికి బాధితురాలి కుటుంబ సభ్యులు దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక కంప్యూటర్కోర్స్నేర్చుకోవడానికి వికారాబాద్జిల్లా కేంద్రంలోని బ్రెయిన్ ట్రీ కంప్యూటర్ట్రైనింగ్సెంటర్కు వెళ్తోంది. రోజూ మాదిరిగానే మంగళవారం కూడా వెళ్లింది.
సెంటర్నిర్వాహకుడు నవాజ్ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధితురాలు ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపింది. ఆగ్రహంతో వారు కంప్యూటర్ సెంటర్కు వచ్చి నవాజ్కు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.