జానపద పాటకు సంప్రదాయ నృత్యం చేసిన మమతా బెనర్జీ

జానపద పాటకు సంప్రదాయ నృత్యం చేసిన మమతా బెనర్జీ

దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కాగా దేశంలోని ప్రజలంతా పల్లె, పట్నం అనే తేడా లేకుండా సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పశ్చిమ బెంగాల్ లోనూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకంగా వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా జానపద కళాకారుల ప్రదర్శన వేళ ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ వారితో జతకలిశారు. కళాకారులతో కలిసి జానపదపాటకు నృత్యం చేశారు. చూసేందుకు కన్నులవిందుగా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక వారితో డ్యాన్స్ అనంతరం ఆమెకు గౌరవంగా .. అక్కడ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులంతా నిలబడి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.