పాక్ ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసిన భారత సైన్యం

పాక్ ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసిన భారత సైన్యం

సరిహద్దుల వెంబడి కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతున్న పాకిస్తాన్ కు… భారత సైన్యం మరోసారి దీటైన జవాబిచ్చింది. ఇవాళ(మంగళవారం) ఉదయం లీపా వ్యాపీలోని ఉగ్ర శిబిరాలను భారత జవాన్లు ధ్వంసం చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ పరిధిలోని ఈ లోయలో టెర్రర్ లాంచ్ పాడ్ ఉన్నట్టు సైన్యానికి సమాచారం అందింది. వెంటనే అలర్టైన భద్రతా దళాలు నాశనం చేశాయి. పాక్ ఆర్మీ పోస్టులకు ఈ లాంచ్ పాడ్ అత్యంత సమీపంలోనే ఉన్నట్టు తెలుస్తోంది.