ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఇండియా – ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్కు మూడో రోజు సైతం ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. శనివారం వీకెండ్ కావడంతో ఉప్పల్ స్టేడియం కిక్కిరిసిపోయింది. ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. 30 వేల 598 మంది హాజరైనట్లు హెచ్ సీఏ తెలిపింది. ఇంగ్లండ్ టీమ్ ఫ్యాన్స్ సైతం వందల సంఖ్యలో కనిపించారు. హెచ్ సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు గ్రౌండ్లోని స్టాండ్లను పరిశీలించారు.
– వెలుగు, హైదరాబాద్/ఫొటోగ్రాఫర్