టెస్టుల్లో ఇండియా చేజారిన టాప్ ర్యాంక్

టెస్టుల్లో ఇండియా చేజారిన టాప్ ర్యాంక్

దుబాయ్ :  సౌతాఫ్రికాతో రెండో టెస్టులో ఘన విజయం సాధించినప్పటికీ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో ఇండియా నంబర్ వన్ ర్యాంక్ కోల్పోయింది. పాకిస్తాన్ తో మూడు టెస్టుల సిరీస్‌‌‌‌లో 2–-0తో నిలిచిన ఆస్ట్రేలియా శుక్రవారం విడుదలైన తాజా జాబితాలో టాప్ ప్లేస్ సొంతం చేసుకుంది. ఇది వరకు ఇండియా, ఆసీస్‌‌‌‌‌‌‌‌ చెరో 118 పాయింట్లతో నిలిచాయి. అయితే, సఫారీలతో టెస్టు సిరీస్ ను డ్రా చేసుకోవడంతో ఇండియా ఓ పాయింట్ కోల్పోయి 117 పాయింట్లతో నిలిచింది.

అదే సమయంలో పాక్ పై ఆసీస్ రెండు టెస్టుల్లో నెగ్గిన ఆసీస్ 118 పాయింట్లను నిలబెట్టుకొని  నంబర్ వన్ ప్లేస్ కు చేరుకుంది. వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ లో మాత్రం టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. సౌతాఫ్రికా, కివీస్, ఆసీస్ టాప్‌‌‌‌4లో ఉన్నాయి.
 

మరిన్ని వార్తలు