ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో ఇండియా ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతుంది. ఇషాన్ కిషాన్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ తుది జట్టులోకి వచ్చాడు. గాయం కారణంగా కిషాన్ నాలుగో టీ20 ఆడట్లేదని సూర్య టాస్ తర్వాత చెప్పుకొచ్చాడు.
ఇప్పటికే ఐదు మ్యాచ్ల సిరీస్ను 3–-0తో కైవసం చేసుకున్న సూర్యకుమార్ సేన బుధవారం (జనవరి 28) జరిగే నాలుగో టీ20లోనూ గెలిచి క్లీన్ స్వీప్ లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మరోవైపు ఇప్పటికే సిరీస్ కోల్పోయిన కివీస్ నాలుగో టీ20లో ఇండియాకు షాక్ ఇచ్చి ఎలాగైనా బోణీ కొట్టాలని కసరత్తులు చేస్తుంది. ప్రస్తుతం 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో ఇండియా 3-0 ఆధిక్యంలో నిలిచింది.
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI):
టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), డెవాన్ కాన్వే, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), జకారీ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, ఇష్ సోధి, జాకబ్ డఫీ
ఇండియా (ప్లేయింగ్ XI):
అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా
