Covid Cases : మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే

 Covid Cases :  మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే

దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 5,880  కేసులు నమోదు అయినట్లుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏప్రిల్ 09  ఆదివారంతో పోలిస్తే  523 కరోనా కేసులు పెరిగాయి.   తాజా కేసులతో కలిపితే దేశంలో యాక్టివ్  కేసుల సంఖ్య 35,199కి పెరిగాయి.  వైరస్ కు మరో 14 మంది బలయ్యారు. 

ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్‌లలో నలుగురు చొప్పున మరణించగా, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర రాజస్థాన్ నుండి ఒక్కొక్కరు, కేరళలో రెండు మరణాలు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం అలర్ట్ అయింది. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాలని అన్నీ రాష్ట్రాలకు  సూచించింది.