ఏంటి సామి ఇదీ : దేశంలో 4 వేల మందికి కరోనా ఉంది

ఏంటి సామి ఇదీ : దేశంలో 4 వేల మందికి కరోనా ఉంది

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 412 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. డిసెంబర్ 26వ తేదీ మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కరోనా కేసుల వివరాలను వెల్లడించింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. కేరళలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుందని, ఎక్కువ కేసులు ఆ రాష్ట్రంలోనే బయటపడుతున్నాయని చెప్పింది. తాజా కేసులతో దేశంలో మొత్తం యాక్టీవ్ కేసుల సంఖ్య 4,170 కు చేరుకున్నాయి. 

తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో తెలంగాణలో 10  కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు  తెలంగాణలో యాక్టీవ్ కేసులు 55కు చేరుకున్నాయి. ఏపీలోనూ 29 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.